AP rice scheme:గుంటూరు జిల్లా ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిరుపేదలు మరియు సామాన్య కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించేలా చౌక ధరలకే నాణ్యమైన బియ్యం ఇస్తున్నారు.
చుట్టిగుంట రైతు బజార్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్ ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక కేంద్రం ద్వారా ప్రజలకు తక్కువ ధరకే మంచి బియ్యం అందుబాటులోకి వచ్చాయి.
Read also: AP Weather Today: అల్లూరి జిల్లాలో భారీ వర్ష సూచన
Fine-grain steamed rice for just ₹50.
రేషన్ కార్డు ఉన్నవారికి ప్రత్యేక రాయితీ ధరలు
తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఈ రాయితీ వర్తిస్తుంది. కేవలం యాభై రూపాయలకే కిలో సన్నబియ్యం అందిస్తున్నారు. అలాగే స్టీమ్ బియ్యం కేవలం యాభై రెండు రూపాయల ధరకే ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యులకు ఈ పథకం ఎంతగానో ఉపశమనం ఇస్తుంది. ప్రజల ఇబ్బందులు తొలగించేలా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
AP rice scheme:ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభం
గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ స్టోర్ ను అట్టహాసంగా ప్రారంభించారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యమైన ఆహార ధాన్యాలు తక్కువ ధరకే ఇస్తుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Epaper: epaper.vaartha.com

