Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గ్యాస్ సిలిండర్ ధర రూ. 29 పెంపు.. నేటి నుంచే అమలు!

గ్యాస్ సిలిండర్ ధర రూ. 29 పెంపు.. నేటి నుంచే అమలు!

వార్త 1 week ago

LPG Price Hike: దేశంలోని మధ్యతరగతి, సామాన్య కుటుంబాల నెలవారీ బడ్జెట్‌పై చమురు సంస్థలు మరోసారి గట్టి దెబ్బ కొట్టాయి. గృహ వినియోగానికి ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరను రూ.

29 పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు (IOC, HPCL, BPCL) నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు ఆదివారం (జూన్ 7) నుంచే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. స్థానిక పన్నులు, రవాణా రీల బట్టి వివిధ నగరాల్లో ఈ ధరల మార్పుల్లో స్వల్ప వ్యత్యాసాలు ఉండవచ్చు. ఈ తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 913 నుండి రూ. 942కి చేరింది. గత మూడు నెలల కాలంలో గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం.

 Budget Burden on Common Man

Read also: Adani Indian billionaires: భారత కుబేరుల రేసులో అదానీ దూకుడు: కేవలం 155 రోజుల్లోనే సంపద భారీగా పెంపు

అంతర్జాతీయ ఉద్రిక్తతలే కారణం.. నష్టాల్లోనే చమురు సంస్థలు

పశ్చిమాసియా (Middle East) ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. ముడి చమురు, గ్యాస్ ధరలు ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగాయి. ముఖ్యంగా భారతదేశానికి గ్యాస్ దిగుమతి అయ్యే అత్యంత కీలకమైన ‘హర్మూజ్ జలసంధి’ (Strait of Hormuz) మార్గంలో సరఫరాకు ఆటంకాలు కలగడం దేశీయంగా ధరల పెంపునకు దారితీసింది. అయితే, ఈ ధరల సవరణకు ముందు వరకు చమురు సంస్థలు దేశీయ మార్కెట్లో ప్రతి సిలిండర్‌పై దాదాపు రూ. 703 వరకు నష్టాన్ని భరిస్తూ వచ్చాయని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుత పెంపు తర్వాత కూడా అంతర్జాతీయ కొనుగోలు ధరకు, దేశీయ విక్రయ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం పూర్తిగా భర్తీ కాలేదని తెలుస్తోంది. కాగా, గత మార్చి నెలలో కూడా సిలిండర్ ధరను రూ. 60 పెంచిన సంగతి తెలిసిందే.

LPG Price Hike: పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ కూడా గుబులు!

కేవలం వంటగ్యాస్ మాత్రమే కాకుండా, గత కొన్ని వారాలుగా మిగతా ఇంధన ధరలు కూడా సామాన్యుడిని బెంబేలెత్తిస్తున్నాయి. మే మధ్య వారం నుంచి ఇప్పటివరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 7.50 వరకు పెరగ్గా, కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరలు కిలోకు రూ. 6 మేర పెరిగాయి. ఇంతగా ధరలు పెంచినప్పటికీ, ఆయిల్ కంపెనీలు ఇంకా పెట్రోల్‌పై లీటరుకు రూ. 11, డీజిల్‌పై రూ. 33.6 చొప్పున నష్టాల్లోనే నడుస్తున్నట్లు సమాచారం.

తలకిందులవుతున్న వంటింటి బడ్జెట్

వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలు దేశంలోని కోట్ల మంది గృహిణుల కుటుంబ బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (PMUY) లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి సబ్సిడీ అందుతున్నప్పటికీ, రాయితీ లేని సాధారణ వినియోగదారులు మాత్రం ఈ అదనపు భారాన్ని పూర్తిగా మోయాల్సి వస్తోంది. విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) వంటి ప్రత్యామ్నాయాలను తీసుకొస్తున్నప్పటికీ, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గులు సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతూనే ఉన్నాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha