Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్ -భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు

హైదరాబాద్ -భోగాపురం మధ్య రోజుకు 5 సర్వీసులు

వార్త 3 weeks ago

Bhogapuram : ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి మైలురాయిగా నిలిచే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది.

ఆగస్టు 17 నుంచి అధికారికంగా సర్వీసులు మొదలుకానుండటంతో, ఎయిర్ ఇండియా (Air India) తన విమాన షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు నడిచే సర్వీసుల వివరాలను వెల్లడించింది. ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రావడంతో విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు తీరడమే కాకుండా, ఈ ప్రాంతంలో వ్యాపార, పర్యాటక రంగాలు మరింత పుంజుకుంటాయని భావిస్తున్నారు.

కనెక్టివిటీకి పెరిగిన ప్రాధాన్యం: హైదరాబాద్, బెంగళూరు, విజయవాడలకు ప్రత్యేక సర్వీసులు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా పలు కీలక నగరాలకు విమాన సర్వీసులను అందుబాటులోకి తెస్తోంది. హైదరాబాద్ – భోగాపురం మార్గంలో అత్యధికంగా రోజుకు 5 సర్వీసులు నడపనున్నారు. అలాగే విజయవాడ – భోగాపురం మధ్య రోజుకు 4 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఐటీ రాజధాని అయిన బెంగళూరు – భోగాపురం మధ్య రోజువారీగా 2 సర్వీసులతో పాటు, వారంలో ఆదివారం మరియు శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో 3వ సర్వీసును కూడా నిర్వహించనున్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఈ విమాన సర్వీసుల వల్ల తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానత (Connectivity) మరింత పెరగనుంది.

దారుణం.. నిద్రిస్తున్న మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగులు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha