Dailyhunt
హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లలో ఉచిత ప్రయాణం.. ఫ్రీ జర్నీ ఎప్పట్నుంచంటే?

హైదరాబాద్ ఎంఎంటీఎస్ ట్రైన్లలో ఉచిత ప్రయాణం.. ఫ్రీ జర్నీ ఎప్పట్నుంచంటే?

వార్త 1 week ago

Hyderabad MMTS: హైదరాబాద్ నగరవాసుల రవాణా కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. జూన్ 2వ తేదీ నుంచి నగరంలోని ఎంఎంటీఎస్ రైళ్లలో అందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఈ పథకానికి సంబంధించిన ముసాయిదా ఒప్పందం ఇప్పటికే సిద్ధమైంది. దీనివల్ల సామాన్య ప్రజలకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా రోడ్లపై ట్రాఫిక్ రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంది. మహిళలతో పాటు పురుషులకు కూడా ఈ ఉచిత జర్నీ అవకాశం వర్తించనుంది.

Read also: Telangana Rains: రాబోయే 2 గంటల్లో ఈ 5 జిల్లాల్లో వర్ష సూచన

 MMTS Train Free Travel Hyderabad Update

Hyderabad MMTS: ఏడాదికి రూ.10 కోట్ల భారం భరించనున్న సర్కార్

సాధారణంగా ఎంఎంటీఎస్ సేవల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి పది కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది. ఇప్పుడు ఉచిత ప్రయాణం అమలు చేయడం వల్ల రైల్వేకు కలిగే ఈ లోటును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. ప్రయాణికుల సంఖ్య పెరిగినా సరే ఆ ఖర్చును భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఉన్న తక్కువ ప్రయాణికుల సంఖ్యను మళ్లీ పెంచి, రైళ్లను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే రైల్వే బోర్డుతో చర్చలు జరిపింది.

మెరుగైన సౌకర్యాలు మరిన్ని షటిల్ బస్సులు

కేవలం ఉచిత ప్రయాణమే కాకుండా రైల్వే స్టేషన్ల వద్ద కనెక్టివిటీ పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ ద్వారా ప్రత్యేక షటిల్ బస్సులను నడపాలని నిర్ణయించింది. ప్రయాణికులు స్టేషన్ నుంచి తమ ఇళ్లకు సులభంగా వెళ్లేలా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో అదనపు రైళ్లు నడపాలని కూడా రైల్వే శాఖను కోరారు. స్టేషన్లలో మౌలిక వసతులు పెంచి, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ సరికొత్త రవాణా విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

రాబోయే 2 గంటల్లో ఈ 5 జిల్లాల్లో వర్ష సూచన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha