Employee Pension Scheme: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన పెన్షన్ విధానంలో సమూల మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది. ముఖ్యంగా 'హయ్యర్ పెన్షన్' ఆప్షన్ ఎంచుకున్న వారికి ఈ కొత్త సంస్కరణలు ఇబ్బందికరంగా మారేలా కనిపిస్తున్నాయి.
ఒక ఆర్టీఐ (RTI) ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ ప్రతిపాదనలు ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Read Also :PM Kisan Maandhan Yojana: నెలకు రూ.3,000 పెన్షన్.. రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్
Minimum Pension Raised to Rs. 3,000… But a Cut for That Category?
ప్రతిపాదిత కొత్త పెన్షన్ విధానం – ముఖ్యాంశాలు
పెన్షన్ ఫండ్పై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈపీఎఫ్ఓ ఈ కొత్త ప్లాన్ సిద్ధం చేసింది. దీని ప్రకారం:
- కనిష్ట పెన్షన్ పెంపు: సామాన్య పెన్షనర్లకు ఊరటనిస్తూ ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ రూ. 1,000 నుండి రూ. 3,000 కి పెంచాలని ప్రతిపాదించారు.
- తప్పనిసరి పెన్షన్: జీతంతో సంబంధం లేకుండా ఉద్యోగులందరినీ తప్పనిసరిగా పెన్షన్ పరిధిలోకి తీసుకురానున్నారు.
- కంట్రిబ్యూషన్ మార్పులు: యజమాని వాటా 8.33 శాతంగానే ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1.16 శాతం వాటాను కేవలం కనిష్ట పెన్షన్ నిధి కోసం మాత్రమే కేటాయిస్తారు.
- అదనపు పొదుపు: రూ. 15,000 కంటే ఎక్కువ జీతం ఉన్నవారు, ఆ పైన ఉండే మొత్తంపై అదనంగా పెన్షన్ కోసం విడిగా పొదుపు చేసుకునే వెసులుబాటు కల్పిస్తారు.
- వెనక్కి వర్తింపు: ఈ కొత్త విధానాన్ని సెప్టెంబర్ 1, 2014 నుండి వెనక్కి వర్తించేలా (Retrospective effect) అమలు చేయాలని భావిస్తున్నారు.
Employee Pension Scheme: హయ్యర్ పెన్షన్ పొందే వారికి నష్టం?
ఎక్కువ జీతం ప్రాతిపదికన అధిక పెన్షన్ ఆశిస్తున్న వారికి ఈ సంస్కరణలు ప్రతికూలంగా మారవచ్చు. పెన్షన్ లెక్కించే విధానంలో మార్పుల వల్ల చేతికి వచ్చే మొత్తం తగ్గే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల చట్టపరమైన చిక్కులు మరియు పెన్షనర్ల నుండి తీవ్ర నిరసనలు వచ్చే అవకాశం ఉందని స్వయంగా ఈపీఎఫ్ఓ నివేదికే పేర్కొనడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు కేంద్ర కార్మిక శాఖ పరిశీలనలో ఉన్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

