Dailyhunt
Hyderabad: పొగమంచుతో శంషాబాద్-బెంగళూరు హైవేలో ట్రాఫిక్ జామ్

Hyderabad: పొగమంచుతో శంషాబాద్-బెంగళూరు హైవేలో ట్రాఫిక్ జామ్

వార్త 3 months ago

తెలంగాణలో తెల్లవారుజామున కమ్ముకున్న దట్టమైన పొగమంచు రోడ్డు రవాణాను తీవ్రంగా ప్రభావితం చేసింది. శంషాబాద్(Hyderabad) నుంచి బెంగళూరు వెళ్లే జాతీయ రహదారిపై విజిబిలిటీ గణనీయంగా తగ్గిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Read also: Irrigation Projects:నదీజలాలపై సీఎం వ్యాఖ్యలపై KTR ఫైర్‌

పొగమంచు కారణంగా ముందువైపు దారి స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యల్లో భాగంగా వాహనాలను రహదారి పక్కకు నిలిపివేయించి ట్రాఫిక్‌ను(Hyderabad) నియంత్రించారు. ముఖ్యంగా భారీ వాహనాలు, లారీలు, బస్సులు ఎక్కువగా నిలిచిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి.

ఇదే సమయంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విమాన ప్రయాణికులు ఆలస్యానికి గురయ్యారు. కొందరు ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చింది.

పొగమంచు తగ్గిన తర్వాత ట్రాఫిక్‌ను క్రమంగా క్లియర్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. డ్రైవర్లు వేగాన్ని తగ్గించి, ఫాగ్ లైట్లు ఉపయోగిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కూడా హెచ్చరించారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Cyberabad drunk driving : న్యూఇయర్ వేడుకల్లో డ్రంక్ డ్రైవింగ్, సైబరాబాద్‌లో 928 మంది అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha