Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇద్దరు ఆడపిల్లల పీక కోసి చంపిన తల్లి.. ఆపై ఆత్మహత్యాయత్నం!

ఇద్దరు ఆడపిల్లల పీక కోసి చంపిన తల్లి.. ఆపై ఆత్మహత్యాయత్నం!

వార్త 4 days ago

Amadalavalasa Vedullavalasa Tragedy: శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండల పరిధిలోని వెదుళ్లవలస గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున అత్యంత ఘోరమైన, మనసును కలచివేసే విషాద ఉదంతం వెలుగుచూసింది.

కన్నతల్లి తన ఇద్దరు కళ్లు తెరివని ఆడపిల్లల పీక కోసి దారుణంగా హతమార్చి, అనంతరం తానూ పీక కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ భయంకర ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.స్థానికులు, పోలీసులు వెల్లడించిన గుండెల్ని పిండేసే వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

ఇంటి తలుపులు తీసేసరికి రక్తపు మడుగులో ఘోరం

వెదుళ్లవలస గ్రామానికి చెందిన కూర్మాపు వరలక్ష్మి (30) అనే మహిళకు ఇద్దరు ఆడపిల్లలు సంతానం. పెద్ద పాప కూర్మాపు భవాని (3), కాగా రెండో పాప కూర్మాపు చాందిని కేవలం 4 నెలల పసికందు. వరలక్ష్మి భర్త రమణ కుటుంబ పోషణ నిమిత్తం కూలి పనుల కోసం నల్లగొండలో ఉంటున్నారు. గ్రామంలో వరలక్ష్మి తన ఇద్దరు పిల్లలు మరియు అత్త కూрమాపు లక్ష్మితో కలిసి నివాసం ఉంటోంది.

సోమవారం రాత్రి వరలక్ష్మి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇంటి లోపల పడుకోగా, అత్త లక్ష్మి ఇంటి బయట వరండాలో పడుకుంది. మంగళవారం ఉదయం నిద్రలేచిన అత్త లక్ష్మి.. ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూసేసరికి గదిలో రక్తపు మడుగులో భీభత్సమైన దృశ్యం కనిపించింది. వరలక్ష్మి తన ఇద్దరు బిడ్డల పీక కోసి చంపేసి, తాను కూడా పీక కోసుకుని పడి ఉంది.

Amadalavalasa Vedullavalasa Tragedy: ఇద్దరు పసికందులు మృతి - కొనవూపిరితో తల్లి

ఈ భయానక ఘటనలో మూడు సంవత్సరాల భవాని, నాలుగు నెలల పసిపాప చాందిని అప్పటికే రక్తపు మడుగులో ప్రాణాలు విడిచి నిర్జీవంగా పడి ఉన్నారు. కన్నతల్లి వరలక్ష్మి తీవ్ర రక్తస్రావంతో కొనవూపిరితో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించిన అత్త లక్ష్మి గట్టిగా కేకలు వేసింది. ఆమె ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకుని, 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న వరలక్ష్మిని తక్షణ అత్యవసర చికిత్స నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ (RIMS) ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘోర ఘటనపై సమాచారం అందుకున్న ఆమదాలవలస పోలీసులు క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వరలక్ష్మి ఈ ఘాతుకానికి ఒడిగట్టడానికి గల కారణాలు, కుటుంబ సమస్యలా లేక ఆర్థిక ఇబ్బందులా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు పసిపిల్లలు శవాలుగా మారడం, తల్లి చావుబతుకుల్లో ఉండటంతో వెదుళ్లవలస గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha