Tirumala : కలియుగ దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిపై ఉన్న భక్తి మనుషులతో ఎలాంటి అసాధ్యాన్ని అయినా సుసాధ్యం చేయిస్తుందని మరోసారి నిరూపితమైంది.
కర్ణాటకకు చెందిన 116 ఏళ్ల అత్యంత వృద్ధురాలు శారీరక బలహీనతలను, వయసు భారాలనూ పక్కనబెట్టి, కేవలం తన మనోబలంతో కాలినడకన తిరుమల కొండను అధిరోహించారు. ఎంతోమంది యువకులే అలిపిరి లేదా శ్రీవారి మెట్టు మార్గంలో నడవడానికి ఆయాసపడే ఈ రోజుల్లో, శతాధిక వృద్ధురాలైన ఈ బామ్మ తన కుటుంబ సభ్యుల అండదండలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఏడుకొండల వాడి చెంతకు చేరుకోవడం చూసి ప్రతి ఒక్కరూ అవాక్కవుతున్నారు.

ఆమె చూపిన ఈ అచంచలమైన భక్తి, దీక్షా దక్షతలు భగవంతునిపై ఉన్న నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి.సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాలు.. నెటిజన్ల హారతిఆ వృద్ధురాలు చేతిలో కర్ర పట్టుకుని, కుటుంబ సభ్యుల సహాయంతో నెమ్మదిగా అడుగులో అడుగేస్తూ తిరుమల మెట్లు ఎక్కుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియా (Social Media) వేదికగా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు (Netizens) బామ్మ సంకల్ప బలానికి దాసోహమంటున్నారు. “ఇది కదా అసలైన భక్తి అంటే!” అని కొనియాడుతూ, ఆమె చూపిన ఈ ధైర్యం వెనుక ఆ సాక్షాత్తూ శ్రీనివాసుని అదృశ్య హస్తం మరియు మహిమే ఉందని భక్తులు కామెంట్ల రూపంలో తమ భక్తిని చాటుకుంటున్నారు. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, నిజమైన భక్తి ఉంటే కొండలనైనా దాటవచ్చునని ఈ బామ్మ నిరూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
తిరుమల తలనీలాలకు భారీ డిమాండ్..కేజీ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు !!

