Gaza Attack : గాజాలో హమాస్ ఉగ్రవాద సంస్థకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. హమాస్ మిలిటరీ చీఫ్లలో ఒకరైన మహమ్మద్ ఒడెహ్ను ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమార్చినట్లు అధికారికంగా ప్రకటించింది.
గాజా సిటీలోని రద్దీ మార్కెట్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో ఒడెహ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో గాజాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కుటుంబ సభ్యులూ మృతి
ఈ వైమానిక దాడిలో మహమ్మద్ ఒడెహ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మరణించారు. ఒడెహ్ భార్య, కుమారుడు, కుమార్తెతో పాటు మరో మహిళ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మార్కెట్ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉన్న సమయంలో దాడి జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పేలుళ్ల ధాటికి పరిసర ప్రాంతాల్లో భారీ విధ్వంసం చోటుచేసుకుంది.
హమాస్ నేతలే లక్ష్యం
హమాస్ అగ్రనేతలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వరుస దాడులు కొనసాగిస్తోంది. ఈ నెల 16న హమాస్ (Gaza Attack) మిలిటరీ చీఫ్ ఇజ్ అల్ దిన్ అల్ హద్దద్ను హతమార్చిన ఇజ్రాయెల్, ఇప్పుడు మహమ్మద్ ఒడెహ్ను కూడా అంతం చేసింది. 2023 అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడులకు ప్రతీకారంగా ప్రతి నాయకుడిని వెతికి మరీ అంతం చేస్తామని ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఆపరేషన్లు అదే వ్యూహంలో భాగమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
బెల్జియంలో పాఠశాల బస్సును ఢీకొట్టిన రైలు..పలువురు మృతి

