Indiramma houses towers:హైదరాబాద్ నగరం కేపీహెచ్బీ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణం కోసం సీఎం రేవంత్ రెడ్డి రేపు భూమిపూజ చేయనున్నారు. పేద ప్రజలకు మెరుగైన వసతి కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ భారీ ప్రాజెక్టును తీసుకువచ్చింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొని పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
Read also: CM Revanth reddy: మహిళా సంఘాలకు త్వరలో రైస్ మిల్లులు.. సీఎం
CM lays foundation stone for ‘Indiramma’ housing towers.
భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు
నగరంలోని 16 నియోజకవర్గాల పరిధిలో ఈ ఆధునిక టవర్లను నిర్మించనున్నారు. మొత్తం 807 కోట్ల రూపాయల వ్యయంతో ఈ నిర్మాణాలు పూర్తి కానున్నాయి. అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ది చేకూర్చేలా అన్ని సౌకర్యాలతో కూడిన భవనాలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది.
Indiramma houses towers:దరఖాస్తులకు ఈనెల 15 వరకు గడువు
ఈ సరికొత్త పథకం కింద ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 15 చివరి తేదీగా ఉంది. అర్హులైన నిరుపేదలు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. త్వరితగతిన లబ్ధిదారులను ఎంపిక చేసి పనులు వేగవంతం చేయనున్నారు.
Epaper: epaper.vaartha.com

