Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

ఇండియా సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే

వార్త 6 days ago

INDIA Alliance Meeting Updates: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన 'ఇండియా' (INDIA) కూటమి అగ్రనేతల కీలక సమావేశంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేసేందుకు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.

దేశంలో ప్రస్తుత రాజకీయ, విద్యా, ఆర్థిక పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించిన కూటమి నేతలు.. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Monsoon Session) అనుసరించాల్సిన వ్యూహాలపై స్పష్టమైన రూట్ మ్యాప్ ఖరారు చేశారు.

Read also:INDIA Alliance Meeting Delhi:ఇండియా' కూటమి భేటీలో సీఎం విజయ్‌కు నో ఎంట్రీ.. ఢిల్లీ వేదికగా ఊహించని ట్విస్ట్!

సుప్రీంకోర్టు సీజేఐ కి లేఖ - విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్

 Oppn Demands Education Minister’s Resignation; Next Meeting in Hyderabad This August

ఎన్నికల ప్రక్రియ మరియు దేశంలోని విద్యా వ్యవస్థలో జరుగుతున్న లోపాలపై కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో జరిగిన ఎన్నికల అవకతవకలు, అక్రమాలు మరియు ఓట్ల చోరీ ఉదంతాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (CJI) కి ఉమ్మడిగా అధికారిక లేఖ రాయాలని కూటమి తీర్మానించింది. జాతీయ స్థాయిలో జరిగిన NEET, CBSE పరీక్షల నిర్వహణలో తీవ్ర అక్రమాలు జరిగాయని, దీనివల్ల లక్షలాది మంది యువత భవిష్యత్తు నాశనమైందని కూటమి ఆరోపించింది. ఈ వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి (Education Minister) తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు.

ఆల్-పార్టీ మీటింగ్ పెట్టాలని కేంద్రానికి అల్టిమేటం

దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని 'ఇండియా' కూటమి స్పష్టం చేసింది. దేశంలో నానాటికీ దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న నిరుద్యోగం, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు మరియు దశాబ్దాలుగా నలుగుతున్న రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని (All-Party Meeting) ఏర్పాటు చేయాలని కోరారు.

పార్లమెంట్‌లో ఉమ్మడి వ్యూహం - ఖర్గే ఆఫీస్‌లో డెయిలీ మీటింగ్స్

రాబోయే వర్షాకాల పార్లమెంట్ సెషన్‌లో అధికార పక్షాన్ని సంయుక్తంగా ఇరుకున పెట్టేందుకు అంతర్గత క్రమశిక్షణను పెంచనున్నారు. సభలో విపక్షాల ఐక్యతను పటిష్టం చేయడం కోసం.. పార్లమెంట్ సమావేశాలు జరిగే ప్రతిరోజూ ఉదయం కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యాలయంలో కూటమికి చెందిన ఫ్లోర్ లీడర్స్ అంతా భేటీ కావాలని నిర్ణయించారు. దీనిద్వారా సభలో ఏ రోజుకారోజు ఉమ్మడి గళాన్ని వినిపించనున్నారు.

INDIA Alliance Meeting Updates: హైదరాబాద్‌లో తదుపరి 'ఇండియా' కూటమి భేటీ

కూటమి బలాన్ని దక్షిణాదికి విస్తరించే క్రమంలో భాగంగా తదుపరి వేదికను ఖరారు చేశారు. ఆగస్టులో భాగ్యనగరం వేదికగా: ఇకపై ప్రతి రెండు నెలలకొకసారి 'ఇండియా' కూటమి అంతర్గత సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న తదుపరి మహా సమావేశాన్ని రాబోయే ఆగస్టు నెలలో భాగ్యనగరం (హైదరాబాద్) లో నిర్వహించబోతున్నట్లు నేతలు అధికారికంగా ప్రకటించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

కొనసాగుతున్న ఇండియా కూటమి సమావేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha