T20 వరల్డ్ కప్లో భాగంగా కొలంబో వేదికగా ఆదివారం జరగనున్న భారత్-పాకిస్థాన్(INDvsPAK) మ్యాచ్కు ముందు మరోసారి హ్యాండ్ షేక్ అంశం హాట్ టాపిక్గా మారింది.
క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ హై వోల్టేజ్ పోరుకు ముందు, క్రీడాస్ఫూర్తిపై చర్చ మొదలైంది.

గత ఆసియా కప్లో టీమ్ ఇండియా ఆటగాళ్లు పాకిస్థాన్ జట్టుతో కరచాలనం చేయకపోవడం పెద్ద వివాదంగా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. కొంతమంది దీనిని రాజకీయ అంశంగా మార్చగా, మరికొందరు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పటిలాగే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. క్రీడలో ప్రత్యర్థి జట్టును గౌరవించడం ముఖ్యమని, నిర్ణయం పూర్తిగా భారత్ చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఇక భారత్-పాక్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ మాత్రమే కాకుండా భావోద్వేగాలు, అభిమానుల అంచనాలు కూడా ఉంటాయి. ఈ మ్యాచ్లో(INDvsPAK) మైదానంలో ఆటతో పాటు ఆటతీరుకు బయట కూడా అనేక అంశాలు చర్చకు వస్తున్నాయి. హ్యాండ్ షేక్ అంశం కూడా అలాంటి ముఖ్యమైన అంశంగా మారింది. మ్యాచ్కు ముందు ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు క్రీడాస్ఫూర్తి కొనసాగాలని కోరుకుంటున్నారు.

