భారత్ మరియు చైనా మధ్య వాణిజ్యం చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందని ఆ దేశ దౌత్యవేత్త ఫియాంగ్ వెల్లడించారు. 2025 సంవత్సరంలో ఇరు దేశాల మధ్య మొత్తం $155 బిలియన్ల విలువైన వాణిజ్యం నమోదైనట్లు తెలిపారు.
ఇది 2024తో పోలిస్తే దాదాపు 12 శాతం పెరుగుదల కావడం గమనార్హమన్నారు.

ఆర్థిక సహకారం బలపడుతున్న సంకేతం
పొరుగు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం క్రమంగా(International Trade) మెరుగుపడుతున్నదానికి ఈ వాణిజ్య వృద్ధి స్పష్టమైన నిదర్శనమని ఫియాంగ్ వ్యాఖ్యానించారు. తయారీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ముడి సరుకులు, టెక్నాలజీ రంగాల్లో వాణిజ్యం గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. ఈ అభివృద్ధి ఇరు దేశాల వ్యాపార వర్గాలకు కొత్త అవకాశాలను తెరుస్తోందన్నారు.
బ్రిక్స్లో భారత్కు మద్దతు
అంతర్జాతీయ వేదికలపై, ముఖ్యంగా బ్రిక్స్ (BRICS) సమూహంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. బ్రిక్స్లో భారత్ నాయకత్వానికి (International Trade)చైనా మద్దతు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక స్వరం మరింత బలపడేందుకు భారత్ పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు.
భవిష్యత్లో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ
రాబోయే రోజుల్లో వాణిజ్యం మాత్రమే కాకుండా పెట్టుబడులు, సాంకేతిక సహకారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాల్లో కూడా ద్వైపాక్షిక సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చైనా సిద్ధంగా ఉందని ఫియాంగ్ తెలిపారు. పరస్పర నమ్మకం, సహకారంతో భారత్-చైనా సంబంధాలు కొత్త ఎత్తులకు చేరతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Trade Deal Impact: సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

