IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ప్రస్థానం అత్యంత నిరాశాజనకంగా ముగిసింది. గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన చావో రేవో లాంటి కీలక పోరులో చెన్నై 89 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసి టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించింది.
మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ బోర్డుపై 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచగా.. కొండంత లక్ష్య ఛేదనలో సీఎస్కే చేతులెత్తేసింది. మిడిలార్డర్ బ్యాటర్ శివమ్ దూబే (17 బంతుల్లో 47 పరుగులు) మెరుపు ఇన్నింగ్స్తో ఒంటరి పోరాటం చేసినప్పటికీ, అతనికి మిగతా బ్యాటర్ల నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. గుజరాత్ బౌలర్లు మహ్మద్ సిరాజ్, రషీద్ ఖాన్లు చెరో 3 వికెట్లతో చెన్నై నడుము విరిచారు. దీంతో సీఎస్కే కేవలం 140 పరుగులకే ఆలౌట్ అయి, ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకుంది.
Read Also : ఉప్పల్ మ్యాచ్కు ముందు బ్లాక్ టికెట్ల దందా, పోలీసుల నిఘా
CSK vs SRH Chepaukధోనీ లేని లోటు
ఈ సీజన్లో చెన్నై జట్టును పరాజయాల కంటే ఎక్కువగా లెజెండరీ క్రికెటర్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) మైదానంలో లేకపోవడం తీవ్రంగా దెబ్బతీసింది. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ధోనీ ఒక్క లీగ్ మ్యాచ్ కూడా ఆడకుండా బెంచ్కే పరిమితమవడం ఇదే మొదటిసారి. బొటనవేలికి తీవ్ర గాయం (Thumb Injury) కావడంతోనే ఆయన ఈ కీలకమైన మ్యాచ్తో పాటు సీజన్ మొత్తానికి దూరంగా ఉండాల్సి వచ్చిందని సీఎస్కే బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ స్పష్టం చేశారు. గతంలో 2010లో మూడు మ్యాచులు, 2019లో రెండు మ్యాచులు మాత్రమే తప్పించుకున్న ధోనీ.. ఈసారి పూర్తి సీజన్ ఆడకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. మైదానంలో ‘థాలా’ వ్యూహాత్మక చతురత, ఫినిషర్ పాత్ర లోపించడమే ఈ ఐపీఎల్లో చెన్నై వైఫల్యానికి, ఘోర పరాజయానికి ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
IPL ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. అర్ధరాత్రి 12 వరకు మెట్రో సర్వీసులు!

