Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జైలులో గొడవ.. 25 మంది ఖైదీలు మృతి

జైలులో గొడవ.. 25 మంది ఖైదీలు మృతి

వార్త 2 weeks ago

Negombo : శ్రీలంకలోని నెగోంబో (Negombo) నగర ప్రధాన జైలు ఘోర రక్తసిక్తమైంది. జైలు ప్రాంగణంలో రెండు ఖైదీల వర్గాల మధ్య చెలరేగిన భీకర ఘర్షణల్లో 25 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.

ప్రాథమిక సమాచారం ప్రకారం, జైలు లోపల అక్రమంగా డ్రగ్స్ (మత్తుపదార్థాలు) సరఫరా చేస్తూ నెట్‌వర్క్ నడుపుతున్న ఒక శక్తివంతమైన ముఠాకు, ఆ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించిన మరో వర్గానికి మధ్య ఈ గొడవ మొదలైంది. రెండు వర్గాలు పదునైన ఆయుధాలు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నాయి. పరిస్థితి తీవ్రరూపం దాల్చడంతో అల్లరి మూకలు జైలు సెక్యూరిటీ సిబ్బంది ఆయుధాలను లాక్కొని కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణ హింసాకాండలో 20 మంది ఖైదీలతో పాటు గొడవను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఐదుగురు జైలు భద్రతా సిబ్బంది (Prison Officers) కూడా ప్రాణాలు కోల్పోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.

మితిమీరిన ఖైదీల సంఖ్య.. భద్రతపై పెరిగిన ఆందోళనలు

ఈ దారుణ ఉదంతం శ్రీలంక జైళ్లలో ఉన్న సామర్థ్యానికి మించిన ఖైదీల (Overcrowding) సమస్యను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. నెగోంబో జైలు వాస్తవ సామర్థ్యం కేవలం 10 వేల మంది ఖైదీలు మాత్రమే కాగా, ప్రస్తుతం అక్కడ ఏకంగా 39 వేల మందికి పైగా ఖైదీలను కుక్కినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మితిమీరిన జనాభా వల్లే ఖైదీలపై నిఘా పెట్టడం, అంతర్గత గొడవలను సకాలంలో అదుపు చేయడం జైలు అధికారులకు సాధ్యపడలేదు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన శ్రీలంక ఆర్మీ, పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) మరియు అల్లర్ల నియంత్రణ దళాలు జైలును తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం నెగోంబో మరియు కొలంబో నేషనల్ ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘోర ఘటనపై అక్కడి ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించింది.

బాబాయ్ పెట్రోల్ కోసం 18 గంటలు లైనులోనే..ఎక్కడంటే..!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha