Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Jaipur: డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. అసలేం జరిగింది?

Jaipur: డ్రైవర్‌ నిర్లక్ష్యం ప్రాణం తీసింది.. అసలేం జరిగింది?

వార్త 4 months ago

రోడ్డు మీద వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంత అవసరంలో ఉన్నా అతివేగం పనికి రాదని పోలీస్ అధికారులు చెబుతున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం లేదు.

విచక్షణ కోల్పోయి వాహనం నడిపితే మీతో పాటు ఎలాంటి తప్పు చేయని అవతలి వాళ్లను కూడా ఇబ్బందులో పడేస్తారు. తాజాగా ఇటువంటి దారుణం రాజస్థాన్‌లో జరిగింది. (Jaipur) వేగంగా వస్తున్న ఓ టాక్సీ రోడ్డు పక్కన ఉన్న కూరగాయల వ్యాపారిని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కూరగాయల వ్యాపారి చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాదానికి కారణమైన సదరు కారు మూడు బైక్‌లు, ఒక లోడింగ్ వాహనాన్ని కూడా ఢీకొట్టింది. దీంతో టాక్సీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గోపాల్‌పుర నుంచి దుర్గాపుర రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్న టాక్సీ అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయింది. ప్రమాద సమయంలో కారు గంటకు దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది. (Jaipur) ఈ ఘటనలో అదే ప్రాంతంలో రోడ్డు పక్కన కూరగాయల వ్యాపారం(Vegetable business) చేసుకునే మహవా మండవర్ నివాసి మహేష్ సైని (50) మృతి చెందాడు. మృతుడు బజాజ్ నగర్‌లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మహావీర్ నగర్ ప్రాంతంలో లోడింగ్ వాహనంలో కూరగాయల దుకాణాన్ని నడుపుతున్నాడు. రోజూ మాదిరిగానే గురువారం కూడా మహేష్ రోడ్డు పక్కన కూరగాయల బండిని ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అతని ప్రాణాలను బలి తీసుకుంది. అయితే అక్కడ చికిత్స పొందుతూ మహేష్ మృతి చెందాడు. కారు డ్రైవర్ జస్వీర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం అతివేగమేనని ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha