Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జలకళ సంతరించుకుంటున్న తెలంగాణ జలాశయాలు

జలకళ సంతరించుకుంటున్న తెలంగాణ జలాశయాలు

వార్త 2 days ago

Water Levels in Reservoirs : ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురుస్తాయన్న అంచనాలను పక్కనపెడితే, ఇటీవల కురుస్తున్న విస్తారమైన వర్షాలు మరియు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తెలంగాణలోని ప్రధాన జలాశయాలు క్రమంగా జలకళను సంతరించుకుంటున్నాయి.

వెలవెలబోయిన ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతుండటంతో నీటి కొరత తీరి, వానాకాలం సాగుపై రైతాంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. పొలం పనులు కూడా వేగవంతమయ్యాయి. రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి బేసిన్లలో ఉన్న ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు 40 ശాతానికి పైగా పెరిగాయి. రాష్ట్రంలోని 87 జలాశయాల పూర్తి నిల్వ సామర్థ్యం 1059 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 433.15 టీఎంసీలు (40.89%) అందుబాటులోకి వచ్చాయి. గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో 142 టీఎంసీలు, కృష్ణా బేసిన్ ప్రాజెక్టుల్లో 290 టీఎంసీలకు పైగా నీరు నిల్వ ఉంది.

Read Also: Indiramma Housing Scheme Online Apply : మొబైల్ నుంచే ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు: తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక వెసులుబాటు

 Water Levels in Reservoirs

Water Levels in Reservoirs : గోదావరి బేసిన్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు

ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాలతో ఉత్తర తెలంగాణలోని ప్రాజెక్టుల నీటి మట్టాలు గణనీయంగా పెరుగుతున్నాయి: పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 33.14 టీఎంసీల నీరు చేరింది. 3.74 టీఎంసీల సామర్థ్యానికి గానూ 3.5 టీఎంసీలతో నిండుకుండలా మారింది. : ఎల్లంపల్లిలో 20.18 టీఎంసీలకు గానూ 19.18 టీఎంసీలు ఉండగా, ఇక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. మిడ్ మానేరులో ప్రస్తుతం 14.23 టీఎంసీలు (పూర్తి స్థాయి 27.55 టీఎంసీలు), లోయర్ మానేరులో 5.62 టీఎంసీల నీరు ఉంది.కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద 3,01,190 క్యూసెక్కులు, సమ్మక్క బ్యారేజీ వద్ద 4,45,670 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద 7,12,676 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతోంది.మంజీరా పరివాహక ప్రాంతాల్లో ప్రవాహాలు మందగించడంతో సింగూరులో 29.92 టీఎంసీలకు 4.2 టీఎంసీలు, నిజాంసాగర్‌లో 17.8 టీఎంసీలకు 8.43 టీఎంసీలు మాత్రమే నీరుంది. కర్ణాటకలోని కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు అక్కడి ప్రాజెక్టులు నిండటంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.జూరాలకు 1,76,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండటంతో 1,55,851 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం జూరాలలో 7.72 టీఎంసీల (పూర్తి స్థాయి 9.66 టీఎంసీలు) నీరుంది. శ్రీశైలానికి వరద ఉద్ధృతి పెరగడంతో నీటి మట్టం 100 టీఎంసీలకు చేరువైంది. 215.81 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 93 టీఎంసీలకు పైగా నీరు చేరింది. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 136.99 టీఎంసీల నిల్వ నమోదైంది.

రైతులకు గుడ్‌న్యూస్.. త్వరలో రానున్న ఫెర్టిలైజర్ యాప్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha