Dailyhunt
జలుక్‌బారిలో ఓటు వేసిన హిమంత బిశ్వ శర్మ

జలుక్‌బారిలో ఓటు వేసిన హిమంత బిశ్వ శర్మ

వార్త 1 week ago

Assam Elections 2026: ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తన భార్య రినికి భుయాన్ శర్మ, పిల్లలతో కలిసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన భార్య మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో తాము 100% క్లీన్ స్వీప్ చేయబోతున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు.

అంతకుముందు, సీఎం దంపతులు గౌహతిలోని ప్రసిద్ధ కామాఖ్య దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Read Also:India-Bangladesh: భారత్, బంగ్లాదేశ్ మధ్య మళ్ళీ చిగురిస్తున్న మైత్రి

 Himanta Biswa Sarma voting Jalukbari

Assam Elections 2026: జలుక్‌బారి – సీఎం కంచుకోట

  • 25 ఏళ్ల ప్రస్థానం: 2001లో అస్సాం గణ పరిషత్ నేత భృగు కుమార్ ఫుకాన్‌ను ఓడించినప్పటి నుండి జలుక్‌బారి స్థానం హిమంత బిశ్వ శర్మకు పెట్టని కోటగా మారింది.
  • గత రికార్డు: 2021 ఎన్నికల్లో ఆయన ఏకంగా 78.4% ఓట్లను (1,30,762 ఓట్లు) సాధించి, కాంగ్రెస్ అభ్యర్థి రోమెన్ చంద్ర బోర్తకూర్ పై భారీ విజయాన్ని అందుకున్నారు.
  • ప్రస్తుత పోరు: ఈసారి కూడా ఎన్డీయే అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన, తన పాత రికార్డులను తిరగరాస్తానని ధీమాగా ఉన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నదిలో 11,000 లీటర్ల పాలర్పణ.. నెట్టింట మొదలైన చర్చ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha