Janagaon Crime: జనగామ జిల్లా కేంద్రంలో ఒక విశ్రాంత ఉపాధ్యాయుడి ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. తన చావుకు తెలంగాణ ప్రభుత్వం, తన బావమరిదితో పాటు హైకోర్టు జడ్జి కూడా కారణమంటూ ఆయన సుమారు 20 పేజీల సుదీర్ఘమైన ఆత్మహత్య లేఖ (సూసైడ్ నోట్) రాసి ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా పెద్ద దుమారం రేపుతోంది.
ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ పరంగా జరిగిన జాప్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
జనగామ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో నివసిస్తున్న పగిడిపల్లి మల్లయ్య అనే విశ్రాంత ఉపాధ్యాయుడు తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. మల్లయ్య రాసిన 20 పేజీల లేఖలో తన వ్యక్తిగత, ఆర్థిక ఇబ్బందులను కూలంకషంగా వివరించారు. తన బావమరిదితో పాటు ఇతర బంధువులు తనకు ఇవ్వాల్సిన పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, నమ్మించి మోసం చేశారని ఆయన ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also : Journalist KVR wife Zero FIR: జర్నలిస్ట్ KVR భార్యపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు
Retired teacher commits suicide in Jangaon; leaves a note blaming specific individuals for his death!
Janagaon Crime: రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వని ప్రభుత్వం
వ్యక్తిగత కారణాలతో పాటు ప్రభుత్వ వ్యవస్థల తీరుపై కూడా మల్లయ్య తన లేఖలో తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తాను పదవీ విరమణ చేసినప్పటికీ, తనకు చట్టబద్ధంగా రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ (జీపీఎఫ్ – GPF) అందించడంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసిందని ఆయన పేర్కొన్నారు. సకాలంలో డబ్బులు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని వివరించారు. అంతేకాకుండా, తన సమస్యకు సంబంధించిన విషయంలో హైకోర్టు జడ్జి కూడా తన చావుకు ఒక కారణమంటూ లేఖలో సంచలన ఆరోపణలు చేశారు.
ఘటనా స్థలానికి పోలీసులు.. కేసు నమోదు
విశ్రాంత ఉపాధ్యాయుడు మల్లయ్య ఆత్మహత్య చేసుకున్న సమాచారం అందిన వెంటనే జనగామ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో లభ్యమైన 20 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మరియు లభించిన లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన విద్యార్థిని దుర్మరణం!

