Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాపర్‌గా శుభమ్ కుమార్, అరోహి దేశ్‌పాండే ఫస్ట్

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో టాపర్‌గా శుభమ్ కుమార్, అరోహి దేశ్‌పాండే ఫస్ట్

వార్త 1 week ago

JEE Advanced results Topper: దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ (JEE Advanced 2026) ఫలితాలను ఐఐటీ రూర్కీ సోమవారం ప్రకటించింది.

ఈ ప్రతిష్టాత్మక పరీక్షలో ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ దేశంలోనే టాప్ ర్యాంకర్ (All India Topper) గా నిలిచి సంచలనం సృష్టించారు. ఇక విద్యార్థినుల విభాగంలో అరోహి దేశ్‌పాండే జాతీయ స్థాయిలో అత్యుత్తమ ర్యాంకును కైవసం చేసుకున్నారు.

JEE Advanced 2026 Results,

Read also: JEE Advanced 2026 Results:జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. ఐఐటీ రూర్కీ ర్యాంక్ కార్డ్ లింక్ ఇదే!

ఢిల్లీ జోన్ హవా.. కోటా కోచింగ్ సెంటర్ల ఆధిపత్యం

ఈ ఏడాది ఫలితాల్లో ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థులు క్లీన్ స్వీప్ చేశారు. కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL)లో శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి ప్రథమ స్థానాన్ని దక్కించుకోగా అదే జోన్‌కు చెందిన కబీర్ చిల్లార్ ద్వితీయ స్థానాన్ని, జతైన్ చాహర్ తృతీయ స్థానాన్ని సాధించి రికార్డు సృష్టించారు. శుభమ్ కుమార్ సాధించిన ఈ అద్భుత విజయంతో దేశంలోనే ఐఐటీ శిక్షణకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రాజస్థాన్‌లోని ‘కోటా’ కోచింగ్ సెంటర్ల హవా మరోసారి నిరూపితమైంది.

JEE Advanced results Topper: కష్టానికి తగ్గ ప్రతిఫలం: ఆనందంలో టాపర్ కుటుంబం

జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడంపై శుభమ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఐఐటీ లక్ష్యంగా సాగిన తన ప్రయాణం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని, భవిష్యత్తులో ఈ పరీక్ష రాయబోయే అభ్యర్థులు కఠోర శ్రమ, పట్టుదల, నిరంతర సాధనను నమ్ముకుంటే విజయం తథ్యమని సూచించారు. శుభమ్ తల్లిదండ్రులు కంచన్ మరియు అతని తండ్రి మాట్లాడుతూ.. తమ కుమారుడు మొదటి నుంచి చదువుపై ఎంతో అంకితభావంతో ఉండేవాడని, అధ్యాపకుల సహకారంతోనే ఈ రోజు జేఈఈ అడ్వాన్స్‌డ్ టాపర్‌గా నిలిచాడని గర్వంగా చెప్తూ ఆనంద బాష్పాలు రాల్చారు.

పరీక్ష గణాంకాలు.. ఫలితాల చెకింగ్ విధానం

ఈ ఏడాది మే 17న జరిగిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు దేశవ్యాప్తంగా రెండు పేపర్లకు కలిపి మొత్తం 1,79,694 మంది అభ్యర్థులు హాజరవగా.. వారిలో 56,880 మంది క్వాలిఫై అయ్యారు. అర్హత సాధించిన వారిలో 10,107 మంది విద్యార్థినులు ఉన్నారు. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్ వివరాలను ఉపయోగించి అధికారిక జేఈఈ అడ్వాన్స్‌డ్ పోర్టల్ ద్వారా స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కౌన్సెలింగ్ సమయంలో ఈ స్కోర్‌కార్డ్ తప్పనిసరి కాబట్టి దీనిని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలని అధికారులు సూచించారు.

తదుపరి ప్రక్రియ: ఐఐటీల్లో సీట్ల భర్తీ

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు త్వరలోనే జాయింట్ సీట్ అలోకేషన్ అథారిటీ (JoSAA) ద్వారా కౌన్సెలింగ్ మరియు సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మెరిట్ మార్కుల ఆధారంగా దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలైన బాంబే, ఢిల్లీ, మద్రాస్, కాన్పూర్, ఖరగ్‌పూర్, రూర్కీ వంటి సంస్థల్లో బీటెక్ సీట్లను భర్తీ చేస్తారు. అయితే, ఈ పరీక్షలో ఆశించిన ర్యాంకు రాని విద్యార్థులు నిరాశ చెందకుండా దేశంలోని ఎన్‌ఐటీలు (NITs), ట్రిపుల్ ఐటీలు (IIITs) మరియు ఇతర ప్రముఖ ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ప్రయత్నించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

ఏపీ విద్యార్థులకు తీపికబురు.. జేఈఈ, నీట్ ఉచిత కోచింగ్.. 4200 మందికి అవకాశం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha