Kavitha poster launch: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత్రి కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఉద్యమకారులకు ఇస్తామన్న 250 గజాల ఇళ్ల స్థలాల కేటాయింపులో ప్రభుత్వం తీవ్ర తాత్సారం చేస్తోందని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలోనే ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నట్లు కవిత ప్రకటించారు.
Read Also : 2026 marriage dates: జూన్ 19 నుంచి ప్రారంభం కానున్న శుభ ముహూర్తాలు
Land struggle for Telangana activists on July 2: Kavitha
Kavitha poster launch: 'భూపోరాటం' పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్ బంజారాహిల్స్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే ఉమ్మడి కార్యాచరణకు సంబంధించిన 'భూపోరాటం' అధికారిక పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
జులై 2న ఉప్పల్ భగాయత్ భూముల ముట్టడి
ఉద్యమకారుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరిని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే జులై 2వ తేదీన వేలాది మంది తెలంగాణ ఉద్యమకారులతో కలిసి తామే స్వయంగా వెళ్లి ఉప్పల్ భగాయత్ భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం జీవోలు ఇచ్చి చేతులు దులుపుకుందే తప్ప, క్షేత్రస్థాయిలో భూమిని అప్పగించలేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
తెలంగాణ సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టిన ఉద్యమకారులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని కవిత స్పష్టం చేశారు. జులై 2న జరగబోయే ఈ భారీ భూపోరాటంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యువత, మహిళలు, తెలంగాణ అస్తిత్వ శక్తులు మరియు ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
తొలి వర్షానికే కుదేలైన హైదరాబాద్.. సర్కార్ వైఫల్యంపై కేటీఆర్ ఫైర్

