Green SM Limo India: భారతదేశంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను (Green Mobility) మరింత బలోపేతం చేస్తూ అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల (EV) రైడ్-హెయిలింగ్ సంస్థ 'గ్రీన్ ఎస్ఎమ్ లిమో' (Green SM Limo) అధికారికంగా అడుగుపెట్టింది.
వియత్నాం, లావోస్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ దేశాలలో విజయవంతంగా సేవలు అందించిన తర్వాత.. ఈ సంస్థ తన విప్లవాత్మక గ్రీన్ మొబిలిటీ సేవలను ప్రారంభించేందుకు ఐదో దేశంగా భారత్ను ఎంచుకుంది.
Read Also:Gold Rate Today: హైదరాబాద్లో రూ.380 తగ్గిన బంగారం.. కిలో వెండిపై భారీ తగ్గింపు!
కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే!

2023లో వియత్నాంలో ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈ గ్రీన్ ఎస్ఎమ్ లిమో సంస్థ ఒక ప్రత్యేకమైన రికార్డును కలిగి ఉంది. సాంప్రదాయ ఇంధన (పెట్రోల్/డీజిల్) వాహనాలకు బదులుగా.. ఈ సంస్థ తన నెట్వర్క్లో కేవలం 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) మాత్రమే రవాణాకు ఉపయోగిస్తుంది. దీనివల్ల నగరాల్లో కాలుష్యం తగ్గడమే కాకుండా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.
Green SM Limo India:ఢిల్లీ-ఎన్సిఆర్లో ప్రీమియం సేవలు
భారత్లో తొలి విడతగా ఈ సేవలను దేశ రాజధాని ప్రాంతమైన ఢిల్లీ-ఎన్సిఆర్ (Delhi-NCR) పరిధిలో అందుబాటులోకి తెచ్చారు. ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, విలాసవంతమైన ప్రయాణ అనుభూతిని అందించేందుకు గానూ సంస్థ ప్రత్యేకంగా 7-సీటర్ ఎస్యూవీ (7-Seater SUV) ఎలక్ట్రిక్ కార్లను రంగంలోకి దించింది. కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి మరియు ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. భారతీయ వినియోగదారులను ఆకర్షించేందుకు గ్రీన్ ఎస్ఎమ్ లిమో సంస్థ ఒక అదిరిపోయే లాంచింగ్ ఆఫర్ను ప్రకటించింది. ఈ సంస్థకు సంబంధించిన అధికారిక యాప్ (App) ద్వారా బుక్ చేసుకునే రైడ్స్పై ప్రయాణికులకు ఏకంగా 50 శాతం ముందస్తు డిస్కౌంట్ (50% Off) లభించనుంది. ఈ ప్రత్యేక ఆఫర్ జూన్ 5 నుంచి జూన్ 11 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రయాణికులు యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుని, పర్యావరణహితమైన సరికొత్త ప్రీమియం ఈవీ ప్రయాణాన్ని సగం ధరకే ఆస్వాదించవచ్చు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
3 వేల నుంచి 4 వేల వరకు పెరిగిన ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు

