Tamil Nadu: తమిళనాడులో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీవీకే, కాంగ్రెస్ పొత్తుపై డీఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. దీనికి సంబంధించిన ప్రధానాంశాలు ఇక్కడ ఉన్నాయి.
తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో కాంగ్రెస్ చేతులు కలపడంపై డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఇలంగోవన్ ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్కు చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు మొదటి నుంచి విజయ్కు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతోనే ఉన్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అనుసరిస్తున్న ఇటువంటి వ్యవహారశైలి వల్లే ఆ పార్టీ అన్ని రాష్ట్రాల్లో వరుసగా పరాజయం పాలవుతోందని మండిపడ్డారు.
Read Also: West Bengal Elections: సీఎంగా మమత రాజీనామా చేయకపోతే ఏమవుతుందో తెలుసా?
వరుస ఓటములపై విమర్శలు
కాంగ్రెస్ పార్టీ ఉనికిపై డీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది ఢిల్లీలో, తాజాగా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఆయన గుర్తు చేశారు. మహారాష్ట్రలో కూడా ఆ పార్టీకి ఎలాంటి అవకాశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులే తమ పార్టీని పూర్తిగా మూసివేసే పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేతో కాంగ్రెస్ పొత్తు ఖరారైంది. ఈ క్రమంలోనే చెన్నైలోని టీవీకే కార్యాలయానికి కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు చేరుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:

