CWC Member Siddaramaiah : కర్ణాటకలో నాయకత్వ మార్పు ప్రక్రియ ఊపందుకున్న వేళ కాంగ్రెస్ అధిష్ఠానం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నేత సిద్ధరామయ్యను కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాత్మక సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యుడిగా నియమించింది.
పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమోదంతో ఈ నియామకం జరిగినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేయడంతో, ఆయనకు జాతీయ స్థాయిలో సముచిత స్థానం కల్పించేందుకే అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకుంది.
Read Also: Weather Update: ఎల్నినో ఎఫెక్ట్.. ఈసారి వర్షాలు తక్కువా?
CWC Member Siddaramaiah
కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం
సిద్ధరామయ్య రాజీనామాతో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. జూన్ 3 సాయంత్రం బెంగళూరులోని లోక్ భవన్లో ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. రాష్ట్రంలో పార్టీ అంతర్గత సమతుల్యత దెబ్బతినకుండా ఉండేందుకే సిద్ధరామయ్యను కేంద్ర రాజకీయాల్లోకి తీసుకువెళ్లినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
CWC Member Siddaramaiah: ఢిల్లీలో అగ్రనేతల కీలక భేటీ.. సుర్జేవాలా, ఎంబీ పాటిల్ అభినందనలు
ఈ నియామకానికి ముందు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఒక కీలక సమావేశం జరిగింది. ఇందులో డీకే శివకుమార్, సిద్ధరామయ్య కూడా పాల్గొన్నారు. కర్ణాటక కొత్త మంత్రివర్గ కూర్పు, రాజ్యసభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. కాగా, సిద్ధరామయ్య సీడబ్ల్యూసీ సభ్యుడిగా నియమితులు కావడంపై కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా, మాజీ మంత్రి ఎంబీ పాటిల్ హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. సిద్ధరామయ్యకు ఉన్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, సామాజిక న్యాయం పట్ల ఆయనకున్న అంకితభావం కాంగ్రెస్ పార్టీని జాతీయ స్థాయిలో మరింత బలోపేతం చేస్తాయని వారు పేర్కొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

