Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కరోనా కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్ యాదవ్

కరోనా కేసులపై ఆందోళన అవసరం లేదు: మంత్రి సత్యకుమార్ యాదవ్

వార్త 3 weeks ago

Satya Kumar Yadav: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల కొన్ని కరోనా కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో జూన్ 26 నుంచి జూలై 16 మధ్య కాలంలో మొత్తం 12 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగుచూడగా, నలుగురు బాధితులు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మంత్రి సత్యకుమార్ ఆరోగ్య శాఖ తాజా పరిస్థితిపై స్పష్టతనిచ్చారు.

పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో తక్కువే.. నిరంతర పర్యవేక్షణ ఉంది!

ఎన్టీఆర్ జిల్లా రాయనపాడులో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన మంత్రి.. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ పరిస్థితిని నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తోందని చెప్పారు. ప్రస్తుతం నమోదవుతున్నవి కేవలం అక్కడక్కడా వస్తున్న చెదురుమదురు కేసులు మాత్రమేనని, వైరస్ వేగంగా విస్తరించడం లేదని స్పష్టం చేశారు. మన పొరుగు రాష్ట్రాలైన కేరళ (115 కేసులు), కర్ణాటక (64 కేసులు), తమిళనాడు (39 కేసులు) లతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో కేసుల తీవ్రత చాలా తక్కువగా ఉందని ఆయన గణాంకాలను వివరించారు.

Satya Kumar Yadav: ల్యాబ్‌కు నమూనాలు.. ఆసుపత్రుల్లో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు సిద్ధం

ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వేరియంట్లు అంత ప్రమాదకరమైనవి కావని అధికారులు ప్రాథమికంగా తేల్చినట్లు మంత్రి తెలిపారు. మరణించిన వారిలో ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు (Comorbidities) ఉండటం వల్లే వైరస్ ప్రభావం ఎక్కువగా చూపించిందని వివరించారు. అయినప్పటికీ వైరస్ రకాన్ని మరింత ఖచ్చితంగా తెలుసుకోవడానికి నమూనాలను పుణెలోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ’ (NIV) కి పంపినట్లు వెల్లడించారు.

ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులను, శానిటైజర్లను సిద్ధంగా ఉంచిందని, కడప వంటి జిల్లాల్లో అత్యవసర సేవల కోసం ‘రాపిడ్ రెస్పాన్స్’ బృందాలను రంగంలోకి దించినట్లు సత్యకుమార్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక గైడ్‌లైన్స్ రాలేదని, అయితే ప్రస్తుత వర్షాకాల వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని మంత్రి సూచించారు.

మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన నిర్మలా సీతారామన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha