కేటీఆర్పై కవిత విమర్శలు
Telangana Politics : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన సోదరుడు, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లోని జాగృతి కార్యాలయంలో పలు సామాజిక సంఘాల నేతలతో సమావేశమైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
"పదేళ్లు ప్రజల్లోకి ఎందుకు రాలేదు?"
పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ప్రజల్లోకి ఎందుకు వెళ్లలేదని కవిత ప్రశ్నించారు. "ఇప్పుడు పాదయాత్ర చేస్తానంటే ప్రజలు నమ్ముతారా?" అంటూ ఆమె ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలను పట్టించుకోని వారు ఇప్పుడు ప్రజల మధ్యకి రావడం వెనుక అర్థమేంటని ప్రశ్నించారు.
కొత్త రాజకీయ ప్రయాణం
సామాజిక తెలంగాణే లక్ష్యంగా తాను కొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించానని కవిత వెల్లడించారు. "అందరికీ అధికారం అందాలి అని నేను మాట్లాడటం ప్రారంభించిన తర్వాతే నాకు సమస్యలు మొదలయ్యాయి" అని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ తనను సస్పెండ్ చేసినా, సామాజిక తెలంగాణ సాధించే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Read Also: Iran China Satellite : చైనా శాటిలైట్తో అమెరికా స్థావరాలపై ఇరాన్ నిఘా?
Telangana Politicsబహుజన సంఘాల మద్దతు
తన కొత్త పార్టీకి పలు బహుజన సంఘాలు మద్దతు తెలుపుతున్నాయని కవిత చెప్పారు. మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ, దళిత బహుజన రాజ్యాధికార సంస్థలు మద్దతు తెలపడం తనకు బలాన్ని ఇస్తోందని తెలిపారు. "వీరన్న అనుచరులు మా వెంట ఉంటే ఇక మమ్మల్ని ఆపే శక్తి ఉండదు" అని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు
బీఆర్ఎస్కు చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని కవిత వెల్లడించారు. సమయం వచ్చినప్పుడు వారి పేర్లు బయటపెడతానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో తమ రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని వారణాసిలో పూజలు కూడా చేసినట్లు ఆమె తెలిపారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
ట్రంప్ షాకింగ్ ట్వీట్: ఇజ్రాయెల్ - లెబనాన్ మధ్య యుద్ధానికి విరామం!

