Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఖాళీ అవుతున్న 'శ్రీశైలం'..తెలుగు రాష్ట్రాలకు నీటి కొరత తప్పదా ?

ఖాళీ అవుతున్న 'శ్రీశైలం'..తెలుగు రాష్ట్రాలకు నీటి కొరత తప్పదా ?

వార్త 2 weeks ago

Srisailam : తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీటికి ప్రధాన జీవనాధారమైన శ్రీశైలం జలాశయంలో నీటి మట్టాలు రోజురోజుకూ ఆందోళనకర రీతిలో పడిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి కేవలం 5 వేల క్యూసెక్కుల స్వల్ప ఇన్-ఫ్లో మాత్రమే వస్తుండటంతో ప్రాజెక్టులోకి నీటి చేరిక పూర్తిగా మందగించింది.

మరోవైపు ఉభయ రాష్ట్రాల అవసరాల నిమిత్తం జలవిద్యుత్ ఉత్పత్తితో పాటు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, కల్వకుర్తి, హంద్రీ-నీవా ఎత్తిపోతల పథకాల ద్వారా నిత్యం దాదాపు 30 వేల క్యూసెక్కుల నీటిని తోడేస్తున్నారు. ఇన్-ఫ్లో తీవ్రంగా తగ్గి, అవుట్-ఫ్లో అధికంగా ఉండటంతో జలాశయ నీటిమట్టం ప్రస్తుతం 872 అడుగులకు పడిపోగా, నీటి నిల్వ 150 టీఎంసీలకు పరిమితమైంది.

ఎల్నినో ప్రభావం: ముంచుకొస్తున్న కరువు ముప్పు

మరోవైపు అంతర్జాతీయ వాతావరణ సంస్థల హెచ్చరికల ప్రకారం 2027 వరకు ఎల్నినో ప్రభావం కొనసాగే అవకాశం ఉందన్న వార్తలు తెలుగు రాష్ట్రాల ప్రజలను, రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీశైలంలో నీటి నిల్వలు ఇదే వేగంతో క్షీణిస్తే రాబోయే రోజుల్లో రబీ సాగుకు నీరందక పంటలు ఎండిపోయే ప్రమాదం ఉపాధ్యాయులు, వ్యవసాయ నిపుణుల ద్వారా వ్యక్తమవుతోంది. అంతేకాకుండా హైదరాబాద్, ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం వంటి అనేక ప్రాంతాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడే అవకాశం ఉంది. రానున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు నీటి వినియోగంపై తక్షణమే సమగ్ర కార్యాచరణ రూపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

విశాఖకు మరో మెగా ఆసుపత్రి.. రేపు ఏఐజీకి లోకేశ్ శంకుస్థాపన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha