Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం ఏం చేయబోతోంది?

కొండా సురేఖ విషయంలో అధిష్ఠానం ఏం చేయబోతోంది?

వార్త 2 weeks ago

Konda Controversy : మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ వివాదంపై క్రమశిక్షణా కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి ఏఐసీసీ పెద్దలతో ఢిల్లీలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.

తాము చెప్పాల్సిన సమాచారాన్ని, పరిస్థితుల తీవ్రతను అధిష్ఠానానికి వివరించామని, ఇకపై ఎలాంటి చర్య తీసుకోవాలన్నా తుది నిర్ణయం అధిష్ఠానానిదేనని టీపీసీసీ చీఫ్ స్పష్టం చేశారు. మరోవైపు కొండా సురేఖ కూడా అధిష్ఠానాన్ని కలసి తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, తన పదవితో లేదా రాజకీయ బాధ్యతలతో దానికి సంబంధం లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.


సామాజిక సమీకరణాలు - అధిష్ఠానం ముందున్న సంక్లిష్ట సమస్య

కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలా వద్దా అనే అంశంలో అధిష్ఠానం తీవ్ర ఊగిసలాటలో పడింది. ఒకవైపు పార్టీలో క్రమశిక్షణను కాపాడటం ముఖ్యం కాగా, మరోవైపు ఆమె రాష్ట్రంలో బలమైన బీసీ వర్గానికి చెందిన కీలక మహిళా నాయకురాలు కావడం రాజకీయంగా పెద్ద సవాలుగా మారింది. బీసీ వర్గానికి చెందిన నేతపై కఠిన చర్యలు తీసుకుంటే అది రాబోయే రోజుల్లో రాజకీయంగా పార్టీకి నష్టం చేకూరుస్తుందనే కోణంలో కూడా ఏఐసీసీ ఆలోచిస్తోంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే పార్టీ అంతర్గతంగా తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భయం ఉంది. దీంతో పార్టీ విధివిధానాలు కాపాడుతూనే, బీసీ సామాజిక వర్గంలో అసంతృప్తి రాకుండా అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

నకిరేకల్‌లో కొత్త ఆస్పత్రి.. సెప్టెంబర్‌ 5న ప్రారంభించనున్న సీఎం రేవంత్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha