Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్

క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్

వార్త 1 week ago

Credit Card : డిజిటల్ చెల్లింపులు మరియు క్రెడిట్ కార్డుల వినియోగం విపరీతంగా పెరుగుతున్న తరుణంలో, సమాంతరంగా జరుగుతున్న సైబర్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు మరియు బాధితులకు తక్షణ ఉపశమనం కలిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

తాజా ఆదేశాల ప్రకారం, క్రెడిట్ కార్డులు లేదా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా ఎవరైనా సైబర్ మోసానికి గురైతే, వారు బ్యాంకుకు ఫిర్యాదు చేసిన కేవలం 5 పనిదినాల్లోగా (5 Working Days) సదరు మొత్తాన్ని బ్యాంకులు తప్పనిసరిగా రీఫండ్ చేయాల్సి ఉంటుంది. దీనిని ‘షాడో రివర్సల్’ (Shadow Reversal) లేదా ‘ప్రొవిజనల్ క్రెడిట్’ (Provisional Credit) రూపంలో బాధితుడి కార్డు లేదా ఖాతాలో తాత్కాలికంగా జమ చేయాలని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీనివల్ల బ్యాంకుల విచారణ పూర్తయ్యే వరకు బాధితులు తమ సొమ్ము కోసం నెలల తరబడి నిరీక్షించాల్సిన తిప్పలు తప్పుతాయి.

 Credit Card

2027 జనవరి 1 నుంచి కొత్త నిబంధనలు

ఖాతాదారుల భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ ట్రాన్సాక్షన్ అలర్ట్స్ విషయంలోనూ ఆర్‌బీఐ కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై క్రెడిట్ కార్డు ద్వారా కేవలం ₹500 అంతకు మించి ఏ చిన్న లావాదేవీ జరిగినా.. ఆ సమాచారాన్ని తక్షణమే యూజర్ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్‌కు అలర్ట్ మెసేజ్ రూపంలో పంపడం బ్యాంకులు మరియు కార్డ్ జారీ చేసే సంస్థలకు తప్పనిసరి కానుంది. దీనివల్ల మనకు తెలియకుండా జరిగే అనధికారిక లావాదేవీలను (Unauthorized Transactions) వెంటనే గుర్తించి, కార్డులను బ్లాక్ చేసుకునే అవకాశం లభిస్తుంది. ఈ నూతన విప్లవాత్మక నిబంధనలు 2027 జనవరి 1 నుండి దేశవ్యాప్తంగా అధికారికంగా అమలులోకి రానున్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేందుకు మరియు సైబర్ నేరగాళ్ల దోపిడీకి బ్రేక్ వేసేందుకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రూ. 100 కోట్లకు పైగా చెల్లించాలని నీరవ్ మోదీకి యూకే కోర్టు ఆదేశం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha