Maharashtra Analogue Paneer Ban: ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్న కృత్రిమ లేదా 'అనలాగ్ పనీర్' (Analogue Paneer) తయారీ, విక్రయాలు, రవాణా మరియు నిల్వలపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు పూర్తి నిషేధం విధించింది.
ఛత్తీస్గఢ్ తర్వాత ఈ రకమైన కఠిన నిర్ణయం తీసుకున్న రెండో రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారాం ముండే జూలై 30, 2026న ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also:Delimitation bill: త్వరలో డీలిమిటేషన్ బిల్లు ప్రత్యేక భేటీ?
Maharashtra Analogue Paneer Ban:నిషేధానికి గల కారణాలు & ప్రధాన నిబంధనలు

- కృత్రిమ పదార్థాల వాడకం: పాలలో ఉండే సహజసిద్ధమైన వెన్న (Milk Fat) స్థానంలో కూరగాయల నూనెలు (Vegetables Oils), వనస్పతి, పిండి పదార్థాలు (Starches), ఎమల్సిఫైయర్లు, ఇతర రసాయన పదార్థాలతో ఈ 'అనలాగ్ పనీర్'ను తయారు చేస్తున్నారు.
- ఉల్లంఘిస్తే తీవ్రమైన శిక్షలు: 'ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006' ప్రకారం కస్టమర్లకు నిజమైన పనీర్కు బదులుగా ఈ కృత్రిమ పనీర్ను విక్రయించడం తీవ్రమైన నేరం:
- సాధారణ ఉల్లంఘనలకు: 6 నెలల వరకు జైలు శిక్ష, ₹1 లక్ష వరకు జరిమానా.
- మరణం సంభవిస్తే: సురక్షితం కాని పనీర్ తిని ఎవరైనా ప్రాణాలు కోల్పోతే జీవిత ఖైదుతో పాటు కనీసం ₹10 లక్షల జరిమానా విధిస్తారు.
- షాకింగ్ ల్యాబ్ నివేదికలు: ఏప్రిల్ 1, 2025 నుండి మార్చి 31, 2026 వరకు FDA నిర్వహించిన తనిఖీల్లో సేకరించిన 308 పనీర్ నమూనాలలో ఏకంగా 109 నమూనాలు (35.4%) నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవు.
- అనలాగ్ చీజ్పైనా దృష్టి: ఈ నిర్ణయాన్ని స్వాగతించిన శ్రీగొండ ఎమ్మెల్యే విక్రమ్ పచ్పుతే, విదేశీ కంపెనీలు యథేచ్ఛగా ఉపయోగిస్తున్న 'అనలాగ్ చీజ్' (Analogue Cheese) పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Epaper: epaper.vaartha.com

