Dailyhunt
క్రూయిజ్ నౌకలో హంటావైరస్ తో ముగ్గురు మృతి..ప్రమాదంలో 150 మంది

క్రూయిజ్ నౌకలో హంటావైరస్ తో ముగ్గురు మృతి..ప్రమాదంలో 150 మంది

వార్త 3 days ago

ట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న 'ఎంవి హోండియస్' అనే క్రూయిజ్ నౌకలో అరుదైన హంటావైరస్ వ్యాప్తి చెందడం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది.

అర్జెంటీనా నుండి అంటార్కిటికా మీదుగా సాగుతున్న ఈ సాహసయాత్రలో ఇప్పటివరకు ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఈ నౌక సుమారు 150 మంది ప్రయాణికులు, సిబ్బందితో పశ్చిమ ఆఫ్రికా తీరంలోని కేప్ వెర్డే సమీపంలో చిక్కుకుపోయింది. ప్రజారోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని స్థానిక అధికారులు నౌకను ఓడరేవులోకి అనుమతించకపోవడంతో, అది తీరానికి దూరంగా బహిరంగ జలాల్లోనే నిలిచిపోయింది. ఈ పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO), నౌకా నిర్వాహక సంస్థ ఓషన్‌వైడ్ ఎక్స్‌పెడిషన్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. మరణించిన వారిలో ఒకరు 70 ఏళ్ల డచ్ వ్యక్తి కాగా, ఆయన భార్య కూడా దక్షిణాఫ్రికాలో విమానం ఎక్కే క్రమంలో కుప్పకూలి మరణించారు.

Read Also: Maternal Health: దేశంలో తగ్గుముఖం పట్టిన మాతృ మరణాల సంఖ్య

 Hantavirus

Hantavirus: అస్వస్థతకు గురైన వారిలో ఒక బ్రిటిష్ పౌరుడి పరిస్థితి విషమం

ఆమె రక్త నమూనాలను పరీక్షించిన తర్వాత hantavirus సోకినట్లు నిర్ధారణ కావడంతో ఈ వ్యాధి తీవ్రత వెలుగులోకి వచ్చింది. మరో మరణం జర్మన్ ప్రయాణికుడికి సంబంధించింది, ఆయన మృతదేహం ఇంకా నౌకలోనే ఉంది. ప్రస్తుతం అస్వస్థతకు గురైన వారిలో ఒక బ్రిటిష్ పౌరుడి పరిస్థితి విషమంగా ఉందని, ఆయనకు దక్షిణాఫ్రికాలో ఐసోలేషన్‌లో చికిత్స అందిస్తున్నారని అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన ఇద్దరు సిబ్బందికి శ్వాసకోశ ఇబ్బందులు ఉండటంతో వారికి అత్యవసర వైద్య సహాయం అందించేందుకు కేప్ వెర్డే నుండి ప్రత్యేక వైద్య బృందాలు నౌకకు చేరుకున్నాయి. హంటావైరస్ సాధారణంగా ఎలుకల మలమూత్రాలు లేదా లాలాజలం ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇది మనుషుల మధ్య వ్యాపించడం అరుదుగా జరిగినప్పటికీ, ఈ క్రూయిజ్ నౌకలో పరిస్థితి భిన్నంగా ఉండటంతో శాస్త్రవేత్తలు దీనిపై లోతైన దర్యాప్తు చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha