Kurnool bus accident: ఏపీలో మంగళవారం తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురై తీవ్ర ఉత్కంఠను కలిగించింది. పాండిచేరి నుంచి హైదరాబాద్కు బయలుదేరిన కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కర్నూలు జిల్లా శివారు ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది.
ఈ ఘటన కర్నూలు నగరానికి సమీపంలోని టిడ్కో హౌస్ వద్ద చోటుచేసుకుంది.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, బస్సు అతివేగంగా ప్రయాణిస్తుండటంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. వేగం ఎక్కువగా ఉండటంతో బస్సు డివైడర్ను దాటి రాంగ్ రూట్లోకి వెళ్లింది. అయితే అదృష్టవశాత్తు ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఒకవేళ ఎదురుగా వాహనాలు వచ్చి ఉంటే తీవ్ర ప్రాణనష్టం సంభవించే అవకాశముండేదని అధికారులు తెలిపారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరటనిచ్చే విషయం. ప్రయాణికులు అందరూ సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులను మరో ప్రత్యామ్నాయ బస్సులో వారి గమ్యస్థానాలకు పంపించారు.

ఈ ప్రమాదంతో కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. బస్సును తొలగించిన అనంతరం రాకపోకలు సాధారణ స్థితికి వచ్చాయి. అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని పోలీసులు భావిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రయాణికుల భద్రత కోసం డ్రైవర్లు వేగ నియంత్రణ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Hyderabad: ఫర్నిచర్ దుకాణంలో ఘోర అగ్ని ప్రమాదం.. 5 మంది మృతి

