Iran attack : గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో దాడి చేసినట్లు సమాచారం.
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు అధికారులు వెల్లడించారు.
టెర్మినల్పై డ్రోన్ల దాడి
విమానాశ్రయంలోని టీ1 ప్యాసింజర్ టెర్మినల్ను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు దాడి చేసినట్లు కువైట్ ప్రభుత్వం తెలిపింది. ఈ దాడి కారణంగా భవనానికి భారీ నష్టం వాటిల్లింది. ఘటన అనంతరం అధికారులు విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసి అన్ని విమాన సర్వీసులను నిలిపివేశారు.
కువైట్ ప్రభుత్వ ఖండన
ఈ దాడిని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ సౌద్ అబ్దుల్అజీజ్ అల్-ఒతైబీ మాట్లాడుతూ, ఇది నేరపూరిత దురాక్రమణ అని పేర్కొన్నారు. శత్రు డ్రోన్లు నేరుగా ప్రయాణికుల టెర్మినల్ను లక్ష్యంగా చేసుకున్నాయని, ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు వెల్లడించారు. బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.
Read also: Italy earthquake: ఇటలీలో భారీ భూకంపం.. 6.1 తీవ్రతతో ప్రకంపనలు
Iran attackహై అలర్ట్లో భద్రతా దళాలు
పరిస్థితిని భద్రతా బలగాలు నిశితంగా గమనిస్తున్నాయని, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. దాడి సమయంలో కువైట్, బహ్రెయిన్ రక్షణ వ్యవస్థలు కూడా యాక్టివేట్ అయ్యాయి. ఇటీవలే తిరిగి ప్రారంభమైన కువైట్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు తాజా ఘటనతో మళ్లీ అంతరాయం ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ విమానయాన సంస్థలు తమ విమానాల మార్గాలను మార్చుతున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

