Ponguleti Srinivasa Reddy:తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలోని నిరుపేదలకు గుడ్ న్యూస్ చెప్పింది. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా అర్హులైన అల్పాదాయ వర్గాలకు సొంత ఇళ్లను నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.
సచివాలయంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు, అజారుద్దీన్ కలిసి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాజధాని చుట్టూ ఉన్న కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో నివసించే ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని మంత్రులు స్పష్టం చేశారు. స్థలం లేని వారికి కూడా ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ఈ పథకాన్ని రూపొందించారు.
Read also: Khammam Crime: మంటగలుస్తున్న దాంపత్య బంధాలు..భార్య టార్చెర్ కు బలైన భర్త
Indiramma Housing Scheme launched in Hyderabad.
525 చదరపు అడుగుల్లో ఆధునిక హంగులతో ఇళ్ల నిర్మాణం
ఈ పథకం కింద నిర్మించే ఇళ్లపై మంత్రులు స్పష్టమైన ప్రకటన చేశారు. భూమి ధరలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా పేదల కోసం ప్రత్యేకంగా హౌసింగ్ బోర్డు టవర్లను నిర్మిస్తున్నారు. ప్రతి ఫ్లాట్ సుమారు 525 చదరపు అడుగుల విస్తీర్ణంలో అందుబాటులోకి వస్తుంది. తొలి దశలో భాగంగా 16 నియోజకవర్గాల్లో ఒక్కో చోట 500 చొప్పున ఇళ్లను నిర్మిస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి ప్రాంతాల్లో లక్ష ఫ్లాట్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ భూములను సద్వినియోగం చేస్తూ పేదలు నివసించే ప్రాంతాలకు దగ్గరలోనే ఈ గృహాలను అందుబాటులోకి తెస్తున్నారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
Ponguleti Srinivasa Reddy:అర్హతలు దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలు
క్యూర్ పరిధిలో ఇళ్లు లేని అల్పాదాయ వర్గాల ప్రజలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల ప్రక్రియ, అర్హతలకు సంబంధించిన పూర్తి విధివిధానాలను ప్రభుత్వం త్వరలో వెల్లడించనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా సొంత స్థలం ఉన్నవారికి 4.50 లక్షల ఇళ్లు మంజూరు చేశామని మంత్రులు తెలిపారు. ఆగస్టు నెలాఖరు వరకు సుమారు 2 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుందని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ భారీ గృహ నిర్మాణ కార్యక్రమం ద్వారా వేలాది మంది పేదలకు సొంతింటి కల నెరవేరనుంది. అర్హులైన వారు నిబంధనలను అనుసరించి దరఖాస్తు చేసుకొని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.
Epaper: epaper.vaartha.com
బంజారాహిల్స్లో భారీ దోపిడీ.. వాష్రూమ్ కిటికీ పగులగొట్టి కిలో బంగారు నగలు లూటీ!

