Bishnoi Gang Encounter: ఉత్తరాది రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ క్రైమ్ సిండికేట్కు పోలీసు యంత్రాంగం గట్టి షాక్ ఇచ్చింది.
హర్యానాలోని బహదూర్గఢ్ పరిధిలో జరిగిన ఒక భారీ ఎదురుకాల్పుల్లో (Encounter) లారెన్స్ బిష్ణోయ్ ముఠాకు చెందిన ఇద్దరు కీలకమైన హంతకులు హతమయ్యారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ (కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్), హర్యానా ‘స్పెషల్ టాస్క్ ఫోర్స్’ (STF) అత్యంత పక్కా ప్లాన్తో సంయుక్తంగా నిర్వహించిన ఈ వేటలో ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఆపరేషన్లో ఒక ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కూడా తూటా గాయాలతో తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Read Also:Eluru Train Accident: ఏలూరు జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు ప్రయాణికులు దుర్మరణం!
జిమ్ ఆపరేటర్ మర్డర్ కేసు నిందితులు.. పోలీసులపైకే కాల్పులు!

ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఉన్నతాధికారి ప్రమోద్ కుష్వా ఈ ఎన్కౌంటర్ వివరాలను మీడియాకు వెల్లడించారు. హతమైన నిందితులను హిసార్కు చెందిన ప్రవేశ్, జఖోద్ ఖేరా గ్రామానికి చెందిన హిమాన్షుగా గుర్తించారు. వీరిద్దరిపై హర్యానా పోలీస్ శాఖ గతంలోనే తలా లక్ష రూపాయల తల బెడద (రివార్డు) ప్రకటించింది.
- నేరాల నేపథ్యం: వీరు లారెన్స్ బిష్ణోయ్-హరిరామ్ అలియాస్ హ్యారీ బాక్సర్-అనిల్ పండిట్ క్రైమ్ నెట్వర్క్లో యాక్టివ్ షూటర్లుగా పనిచేస్తున్నారు. జూన్ 11న హన్సీ ప్రాంతంలో కпіల్ అనే జిమ్ ఆపరేటర్ను పట్టపగలే దారుణంగా కాల్చి చంపిన కేసులో వీరే ప్రధాన నిందితులు. ఆ నాటి హత్య తాలూకు సీసీటీవీ విజువల్స్ దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
- స్కెచ్ వేస్తుండగా చుట్టుముట్టిన బలగాలు: బహదూర్గఢ్ ప్రాంతంలో మరో పెద్ద నేరానికి పాల్పడేందుకు నిందితులు భారీగా ఆయుధాలతో ఇక్కడికి వచ్చినట్లు నిఘా వర్గాల నుంచి కచ్చితమైన సమాచారం అందింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితులను చుట్టుముట్టారు.
Bishnoi Gang Encounter: ఆత్మరక్షణ కోసమే ఎదురుకాల్పులు: ఎస్పీ విక్రాంత్ భూషణ్
హర్యానా ఎస్టీఎఫ్ ఎస్పీ విక్రాంత్ భూషణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులను లొంగిపోవాల్సిందిగా పోలీసులు హెచ్చరించారు. అయితే, పోలీసుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ నిందితులు అంధాధూంధీగా కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఢిల్లీ స్పెషల్ సెల్ కానిస్టేబుల్ అంకిత్ కాలికి బుల్లెట్ తగిలింది. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. తీవ్రంగా గాయపడిన ముగ్గురినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నిందితులిద్దరూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కానిస్టేబుల్ అంకిత్కు ప్రాణాపాయం తప్పింది.
Epaper: epaper.vaartha.com

