తెలంగాణ (TG Weather) రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరించారు.
ఇప్పటికే (TG Weather) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోవడంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. సాధారణంగా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి, కానీ ఈ ఏడాది సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలం అత్యంత శీతల ప్రాంతంగా నిలుస్తోంది.
Trains: రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు

కోహీర్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు
సాధారణంగా ఏటా కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈసారి సంగారెడ్డి జిల్లా కోహీర్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సిద్దిపేట జిల్లా పోతిరెడ్డి పేటలో 9.2 డిగ్రీలు, మెదక్ జిల్లా దామరంచలో 10 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.ఉదయం వేళ దట్టమైన మంచు కురుస్తుండటంతో వాహనదారులు, కూలీలు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Latest News: TSSPDCL: తెలంగాణలో మూడో డిస్కంతో విద్యుత్ రంగంలో కొత్త అధ్యాయం

