Mamata Banerjee : ప్రజాస్వామ్య దేశంలో ప్రశ్నించే హక్కు అందరికీ ఉంటుంది. సమస్యపై పోరాడేందుకూ ఓ పద్ధతి ఉంటుంది. అదీ ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రశ్నిం చడం మర్యాద, సంస్కారవంతం.
కానీ కండబలంతో ఎవరినోరైనా నొక్కగలమనుకుంటే అది ఆరాచకానికి దారి తీస్తుంది. ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకునే ఏ ప్రభుత్వమైనా నియమబద్ధంగానే పాటించాలి. తప్ప అరాచకం తో అయోమయం సృష్టించాలంటే అది సాధ్యకాదు. ఎలాగైనా బయటకొచ్చేస్తుంది. గతకొన్నాళ్లుగా పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న ‘ప్రశ్నించడాలూ, నిరసన వ్యక్తం చేయడాలూ’ అనే సందర్భంలో అరాచకం రాజ్యమేలు తోందన్న అభిప్రాయం న్యాయపాలికలో వ్యక్తమైంది. పశ్చిమ బెంగాల్ మమతాబెనర్జీ ఐదేళ్ల పరిపాలనత్వరలో పూర్తవుతుంది. ఇప్పటికే మూడుసార్లుగా బెంగాల్ రాజ్య మేలిన మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రి కావాల నుకుంటున్నారు. ఇంతవరకు అభ్యంతరమేమీ లేదు. కానీ ఏకంగా న్యాయవ్యవస్థ కనుసన్నల్లో సుప్రీం ధర్మా సనం పర్యవేక్షణలో జరుగుతున్న ఓటరు జాబితాల సవరణ కార్యక్రమాన్ని నవ్వులపాలు చేయాలని కంకణం కట్టుకున్నా పశ్చిమ బెంగాల్ రాజకీయ పార్టీ కార్యకర్తలు వ్యవహారం బాగా దూకుడుగా తయారైంది. ఆ రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియం ముమ్మరంగా సాగుతోంది. కాగా ఈ ప్రక్రియలో దాదాపు 80వేల మంది ఓటర్లను అన్యాయం గా తొలగించారంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చాలా కాలంగా ఎన్నికల కమిషన్పై విరుచుకపడు తున్నారు.
Read Also :Tamilnadu Elections: ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఆగ్రహం
Mamata Banerjee
Mamata Banerjee : ‘సర్’ ప్రక్రియకు అడ్డం కులు
పరోక్షంగా ఎన్నికల కమిషన్ ప్రతి కార్యక్రమా న్ని ఆమె తప్పుపడుతున్నారు. వారు తలపెట్టిన ఏ కార్య క్రమమైనా ప్రజాయోగ్యంకాదని వాదిస్తున్నారు. దాంతో సుప్రీంకోర్టు ధర్మాసనం జోక్యం చేసుకుని ఎన్నికల కమి షన్కు కొన్ని మార్గదర్శక సూత్రాలను అందించింది. ‘సర్’ కార్యక్రమాన్ని సజవుగా నడిపించేందుకు జ్యుడీషియల్ అధికార్లను పర్యవేక్షకులుగా నియమించి ఓటర్ల అభ్యంత రాలను సరి చేయించే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ ‘మాల్టా’ కాలియ చౌక్ జిల్లాలో కొందరు కార్యకర్తలు ‘సర్’ విధుల్లో ఉన్న ముగ్గురు మహిళలతో సహా ఏడుగురు అధికారుల్ని నిర్బంధించారు. ఆపై వారి వాహనాల మీద రాళ్లు కర్రలతో దాడిచేశారు. ఈ విష యం తెలిసి అధికారులపై దాడిని సుప్రీం ధర్మాసనం ఖండించింది. పశ్చిమ బెంగాల్పాలనా యంత్రాంగం నిష్క్రియాపరత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదొక నేరపూరిత వైఫల్యంగా పేర్కొని మమత ప్రభు త్వాన్ని తీవ్రంగామందలించింది. ‘సర్’ ప్రక్రియకు అడ్డం కులు కలుగ కుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. జరిగిన ఉదంతంపై సిబిఐ లేదా ఎస్ఐతో దర్యాప్తు జరిపించాలంటూ ఇసికి సూచించింది. కేవలం కొందరు ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వారి ఓట్లను తొలగించడమే ‘సర్’ కార్యక్రమంగా ఉంటోందని మమతా బెనర్జీ ఆది నుంచి ఇసిపై ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి సందర్భంలో ఇసికి, మమతా బెనర్జీకి మధ్య పొత్తు పొసగడం లేదు. సాయంత్రం 3.30కి మొదలైన దుస్సంఘటన అర్థరాత్రి వరకు కొనసాగుతూనే ఉంది.
రాజకీయ భాష
నిర్బంధంలో ఉన్న జుడీషియల్ అధికారుల్ని రక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలసత్వం వహిస్తోందని ధర్మాసనం బెంగాల్ప్రభుత్వాన్ని నిందించింది. ఈ అంశంపై బెంగాల్ ప్రజల్లో వ్యతిరేకతలు చోటు చేసుకున్నాయి. అధికారుల్లో మనోధైర్యం దెబ్బ తీసేందుకు ముందస్తు ఆలోచనతోనే కుట్ర జరిగిందని ధర్మాసనం వ్యాఖ్యలుచేసింది. సంఘటన ఉదంతం తెలియగానే సుప్రీంధర్మాసనం ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరిం చారు. చట్టాలను చేతుల్లోకి తీసుకోవాలనుకోవడాన్ని కోర్టు క్షమించదని హెచ్చరించారు. బెంగాల్లో ప్రతి ఒక్కరూ రాజకీయ భాష మాట్లాడుతున్నారని ఆవేశకావే శాలకు లోనుకావడం సరికాదని కోర్టు మందలించింది. రాజకీయ ప్రేరేపిత చర్య కాదని అనుకునేందుకు వీలుగా లేదని అన్నారు. కోల్కత్తా ప్రధాన న్యాయమూర్తి రంగం లోకి దిగి డిజిపి, హోంశాఖ కార్యదర్శితో మాట్లాడితే తప్ప ప్రభుత్వపరమైన సహాయం లభించలేదని జస్టిస్ సూర్యకాంత్ వివరిస్తున్నారు. దాదాపు 9 గంటల పాటు న్యాయాధికారుల నిర్బంధం జరిగిందంటే మనం ఎక్కడ ఉన్నామని ప్రశ్నించారు. న్యాయవ్యవస్థను భయభ్రాంతు ల్ని చేయాలనుకునే ఆలోచనమంచిదికాదన్నారు.
Mamata Banerjee
శాంతిభద్రతల సమస్య
ప్రజాస్వామ్య ప్రభుత్వాలున్న చోట అధికారులకు రక్షణ కల్పిం చకపోవడం అసలలాంటి విషయమే జరిగినట్లు గుర్తించక పోవడం లేదా అలాంటి నిరసన, లేక నిర్బంధం ‘సర్’ పర్యవేక్షకుల విధి నిర్వహణను ఆటంకపరచడం ప్రభుత్వ వైఫల్యమే అవుతుంది. ‘సర్’ ప్రక్రియకు అడుగడుగునాఆటంకపరిచే ధోరణిలో వ్యవహరిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతాబెనర్జీదే బాధ్యత అనిఅనుకోవాల్సి వస్తోం ది. కాగా పశ్చిమబెంగాల్లో శాంతిభద్రతల సమస్య ఉన్న ట్లు సృష్టించి రాష్ట్రపతి పాలనలోకి మళ్లించాలనే ఆలోచ నతో కేంద్ర హోంశాఖమంత్రి అమిల్షా కుట్ర చేస్తున్నట్లు బెంగాల్ ముఖ్యమంత్రి ఆరోపణ హాస్యాస్పదంగా ఉంది. అదేదో రాజకీయ నిరసనఅంటూ ప్రభుత్వం ఇచ్చిన వివ రణను ధర్మాసనం తోసి పుచ్చింది. మొదట్లో మమతా బెనర్జీ ఓటర్ల జాబితా సవరణ ఓ ఫార్స్లో జరుగుతోంద ని ఆరోపించగానే ధర్మాసనం 700 మంది జ్యుడీషియల్ అధికారులను ఎస్ఐఆర్పై అభ్యంతరాలను పరిష్కరించే పనిలో పెట్టింది. ఎవరి నుండి ప్రేరణపొందినా అధికా రుల్ని బంధించే ప్రక్రియచట్టబద్ధం కాదు. ఆహ్వానించదగినది కాదు. ఇంతకుముందు ఐపాక్ కార్యాలయాలపై ఇడి సందర్భంలోనూ మమత దూకుడు చూశాం.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
మైనారిటీలపై దాడులు చేసేవారితో విజయన్ కు సంబంధాలు.. రాహుల్ గాంధీ ఆరోపణలు

