పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వస్తున్న వార్తలు సామాన్యులను కలవరపెడుతున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు (Crude Oil) ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, దేశీయంగా ఇంధన ధరలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నా, దేశీయంగా చమురు కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు నెలకు సుమారు రూ. 30,000 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్లు అంచనా. ఈ భారీ ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.4 నుండి రూ.5 వరకు పెంచేందుకు అనుమతి ఇవ్వాలని కంపెనీలు కేంద్రాన్ని కోరుతున్నాయి. మే 15 లోపు దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Read Also : మాకు మంత్రి పదవులు వద్దు..నువ్వు కావాలి ! విజయ్ ని కోరిన సిపిఐ, సిపిఎం

గ్యాస్ సిలిండర్ ధర కూడా పెరిగే ఛాన్స్?
కేవలం వాహనదారులకే కాకుండా గృహిణులకు కూడా ఈ ధరల సెగ తగిలేలా ఉంది. పెట్రో భారం తో పాటు డొమెస్టిక్ ఎల్పీజీ (LPG) సిలిండర్ ధర కూడా Rs.40 నుండి Rs.50 వరకు పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వాణిజ్య సిలిండర్ల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు గృహ అవసరాలకు వాడే సిలిండర్ల ధరలు కూడా పెరిగితే సామాన్యుడి నెలవారీ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడుతుంది. యుద్ధ మేఘాలు మరియు అంతర్జాతీయ సరఫరా గొలుసులో అంతరాయాలే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
రవాణా ఖర్చులు మరియు ద్రవ్యోల్బణంపై ప్రభావం
ఒకవేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే ఆ ప్రభావం నేరుగా నిత్యావసర వస్తువులపై పడుతుంది. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల కూరగాయలు, పాలు మరియు ఇతర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇది దేశంలో ద్రవ్యోల్బణం (Inflation) పెరగడానికి దారితీస్తుంది. ప్రస్తుతం మార్కెట్ నిపుణులు మరియు ఆర్థికవేత్తలు మే 15వ తేదీన వచ్చే అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పన్నుల తగ్గింపు ద్వారా ఈ భారాన్ని ప్రజలపై పడకుండా చూస్తుందో లేదో వేచి చూడాలి.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
త్వరగా కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి - గవర్నర్ కు స్టాలిన్ విజ్ఞప్తి

