Medico Priyanka Case Update: రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని (మెడికో) ప్రియాంకపై కారుతో దాడి చేసిన ఘోర ఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్రంగా స్పందించారు.
ఈ దారుణానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దోషులకు చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
Read Also:Medico Priyanka Case:రాజమండ్రి మెడికల్ విద్యార్థిని ఘటన.. మారనున్న సెక్షన్లు!
Medico Priyanka Case Update: ఎస్పీతో సమీక్ష & తండ్రికి ఫోన్

- జిల్లా ఎస్పీతో ఫోన్ సంభాషణ:ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీతో హోంమంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు పురోగతి, కేసు నమోదైన తీరు, తదుపరి తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితులపై కఠినమైన సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
- తండ్రి వెంకటేశ్కు ప్రభుత్వం అభయం:అనంతరం బాధితురాలు ప్రియాంక తండ్రి వెంకటేశ్తో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ధైర్యం చెప్పి, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు.
- నిందితుల అరెస్ట్ & రిమాండ్:ఘటన జరిగిన వెంటనే పోలీసులు వేగంగా స్పందించారని, నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని మంత్రి తెలిపారు. దర్యాప్తును మరింత వేగవంతం చేసి, బాధితురాలికి మరియు ఆమె కుటుంబానికి త్వరలోనే పూర్తి న్యాయం జరిగేలా చూస్తామని పునరుద్ఘాటించారు.
Epaper: epaper.vaartha.com

