కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రతికూల రాజకీయ విధానాలను దేశ ప్రజలు స్పష్టంగా తిరస్కరిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ(Modi) వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా బీజేపీకి మద్దతు క్రమంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు. బీహార్, తిరువనంతపురం, ముంబయి వంటి కీలక ప్రాంతాల్లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాలు ప్రజలు సుపరిపాలన, అభివృద్ధి ఆధారిత రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని స్పష్టంగా తెలియజేస్తున్నాయని మోదీ అన్నారు.

అస్సాంలో కాంగ్రెస్ పాత్రపై మోదీ తీవ్ర విమర్శలు
అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అభివృద్ధి దిశ లేదని ప్రధాని మోదీ(Modi) తీవ్రంగా విమర్శించారు. భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలపడం, అక్రమ చొరబాటుదారులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా రాష్ట్ర భద్రతను ప్రమాదంలోకి నెట్టుతోందని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రోత్సహించిన అక్రమ వలసదారులు స్థానికుల భూములను ఆక్రమించడమే కాకుండా, అస్సాం ప్రజల సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్ర ప్రజల అస్తిత్వమే ముప్పుకు గురవుతోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. అస్సాంలో శాంతి, భద్రత, అభివృద్ధి కోసం బలమైన నిర్ణయాలు అవసరమని ఆయన సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

