Dailyhunt
నదిలో విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు దుర్మరణం!

నదిలో విషాదం.. ఈతకు వెళ్లి నలుగురు దుర్మరణం!

వార్త 3 weeks ago

Tungabadra Drowning Accident :ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని కర్నూలు జిల్లా కోసిగి మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మండలంలోని కందుకూరు గ్రామ సమీపంలో ప్రవహిస్తున్న తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన నలుగురు వ్యక్తులు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు మృత్యువాత పడటంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Read Also:Anantapur Crime: ఇంటి ముందు శవాన్ని పాతిపెట్టి రోజూ ముగ్గులు.. 4 నెలల తర్వాత వెలుగులోకి వచ్చిన దారుణం

 The deceased include two young men and two women.

Tungabadra Drowning Accident: మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

మృతులంతా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలోని కురుడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. నదిలో ఈత కొట్టేందుకు వచ్చి లోతు అంచనా వేయలేక ప్రమాదవశాత్తూ నీటి సుడిగుండంలో చిక్కుకుని వీరు ప్రాణాలు వదిలినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికితీశారు.

Tungabadra Drowning Accident: మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు

పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషాద సమాచారాన్ని కర్ణాటకలోని మృతుల కుటుంబ సభ్యులకు చేరవేశారు. వేసవి కాలంలో నదులు, కాలువల్లో ఈతకు వెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

9 ఏళ్ళ కూతురిని కిరాతకంగా చంపిన తండ్రి! ఎందుకంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha