Dailyhunt
Nalgonda: కార్మికుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

Nalgonda: కార్మికుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

వార్త 2 months ago

తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో విషాదకర ఘటన జరిగింది. నల్గొండ రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల మధ్య చిన్న వివాదం చెలరేగింది.

మాటల తూటాలు కాస్తా తీవ్ర ఘర్షణగా మారి, ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకునే స్థాయికి చేరింది. ఈ ఘర్షణ ఒక్కసారిగా ఉద్రిక్తతను సృష్టించింది.

Read also: Gadwal: భార్య తన వద్దకు రావడం లేదని భర్త ఆత్మహత్యయత్నం

రాళ్ల దాడిలో చంద్రు మృతి

ఈ దాడిలో నాగర్‌కర్నూలు జిల్లా, తెలకపల్లి మండలానికి చెందిన చంద్రు తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమించడంతో అక్కడికక్కడే చంద్రు ప్రాణాలు కోల్పోయాడు. అదే ఘటనలో చంద్రు సోదరుడితో పాటు మరో వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేసు నమోదు

చంద్రు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నల్గొండ (Nalgonda) టౌన్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కార్మికుల మధ్య ఘర్షణకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Air pollution: అభివృద్ధి పేరుతో ఊపిరి దోపిడి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha