ప్రాణహాని ఉందంటూ ఆరోపణలు చేస్తున్న ప్రాతూరి జగదీశ్, తక్షణమే పోలీసు రక్షణ కల్పించాలని అధికారులను కోరారు. ఇప్పటికే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
తన ఫిర్యాదుపై స్పందన లేకపోతే న్యాయపరంగా పోరాటం చేస్తానని స్పష్టం చేశారు.

రాజకీయ ఒత్తిళ్లే కారణమా?
జగదీశ్ ఆరోపణల నేపథ్యంలో రాజకీయ ఒత్తిళ్ల అంశం తెరపైకి వచ్చింది. ప్రభావవంతమైన నేతలు ఉండటంతో తన గోడు వినిపించుకునే పరిస్థితి లేకుండా పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాత విచారణ జరిపించాలని పలు వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్పందించని నందిగం సురేశ్ వర్గం
ఈ ఆరోపణలపై ఇప్పటివరకు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్(Nandigam Suresh) లేదా ఆయన కుటుంబ సభ్యుల నుంచి అధికారిక స్పందన రాలేదు. దీంతో ఈ వివాదం మరింత ఉత్కంఠను రేపుతోంది. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒక మాజీ ఎంపీపై(Nandigam Suresh) ప్రాణహానీ ఆరోపణలు రావడంతో స్థానికంగా కలవరం నెలకొంది. ఈ ఘటన ఏ మలుపు తిరుగుతుందన్నది, న్యాయం ఎవరి వైపు నిలుస్తుందన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com

