Nara Lokesh : దావోస్ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో కొత్త దిశను ప్రకటించింది. 2035 నాటికి రాష్ట్రాన్ని 'డే-జీరో రెడీ స్టేట్' గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
ఇకపై 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మాత్రమే కాకుండా **'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' పై పూర్తి దృష్టి పెట్టామని తెలిపారు.
దావోస్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడిన లోకేశ్, పెట్టుబడిదారులకు సమయమే అతిపెద్ద లాభమని అన్నారు. పెట్టుబడి నిర్ణయం తీసుకున్న కొన్ని వారాల్లోనే పనులు ప్రారంభమయ్యేలా వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి (SIPB) ప్రతినెలా సమావేశమై ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తోందని వెల్లడించారు.

అనుమతుల విషయంలో వరుస ప్రక్రియల (Nara Lokesh) స్థానంలో ప్యారలల్ ప్రాసెసింగ్ అమలు చేస్తున్నామని తెలిపారు. భూమి, విద్యుత్, నీరు, పర్యావరణ అనుమతులు ఒకేసారి ప్రాసెస్ అయ్యేలా డిజిటల్ గవర్నెన్స్ను ప్రవేశపెట్టామని చెప్పారు. గత 18 నెలల్లో 50కి పైగా సంస్కరణలు అమలు చేశామని, డీ-రెగ్యులేషన్పై ప్రభుత్వం గట్టిగా పనిచేస్తోందన్నారు.
Chittoor: చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
రాష్ట్ర అభివృద్ధి కొద్ది నగరాలకే పరిమితం కాకూడదన్న లక్ష్యంతో ప్రతి జిల్లాలో ఎంఎస్ఎంఈ ఆధారిత వృద్ధిపై దృష్టి పెట్టామని తెలిపారు. 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని, అగ్రో ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, సముద్ర ఉత్పత్తుల వంటి రంగాలకు ప్రత్యేక క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.
వేగవంతమైన అనుమతులు, నాణ్యమైన మౌలిక వసతులు, నైపుణ్యమున్న మానవ వనరులే ఏపీ బలమని లోకేశ్ పేర్కొన్నారు. నమ్మకం, వేగం కలిసి ఆంధ్రప్రదేశ్ను ప్రపంచ పెట్టుబడిదారుల ప్రధాన గమ్యస్థానంగా మార్చుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

