Narsapur Ration Rice Seized: నర్సాపూర్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేతనర్సాపూర్లోభారీగా రేషన్ బియ్యం పట్టివేత, బియ్యాన్ని లారీని స్వాధీనం చేసుకున్న అధికారులు.
అక్రమంగా రాష్ట్రం దాటిస్తున్న రేషన్ బియ్యాన్ని నర్సాపూర్ లో సివిల్ సప్లై అధికారులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి నర్సాపూర్ మీదుగా మహారాష్ట్రలోని గోండియాకు లారీలో గుట్టుగా తరలిస్తున్న సుమారు 350 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని గురువారం నర్సాపూర్ ఆర్టీసీ డిపో వద్ద పౌరసరఫరాల అధికారులు పట్టుకున్నారు.
Read also: Nagole 72 feet mud ganesh: ఖైరతాబాద్ గణేషుడికి పోటీగా నాగోల్ బడా గణేష్
Narsapur Ration Rice Seized: నర్సాపూర్లోభారీగా రేషన్ బియ్యం పట్టివేతలారీ డ్రైవర్ గుట్టు రట్టు
సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశం ఆదేశాలతో పక్కా నమ్మదగిన సమాచారంతో దాడులు నిర్వహించి అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకొని స్వాధీనం చేసుకొని బియ్యాన్ని లారీని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ నర్సింలు విచారణ తదుపరి విచారణ నిమిత్తం లారీని లింగాపూర్లోని తిరుమల ఆగ్రో మిల్లుకు తరలించారు. ఈ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారుల గుట్టు తేలాల్సి ఉందని సివిల్ సప్లై అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డీఎస్పీ వెంకటేశం, ఇన్స్పెక్టర్ నర్సింలు, నర్సాపూర్ ఎస్సై టు కృష్ణ తదితరులు ఉన్నారు
Epaper: epaper.vaartha.com

