Dailyhunt
నేడు 45 నిమిషాల పాటు యూపీఐ, యోనో సేవలు బంద్!

నేడు 45 నిమిషాల పాటు యూపీఐ, యోనో సేవలు బంద్!

వార్త 2 weeks ago

SBI Banking Services Down: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.

సిస్టమ్ మెయింటెనెన్స్ (సాంకేతిక నిర్వహణ) పనుల కారణంగా నేడు ఉదయం 11:00 గంటల నుండి 11:45 గంటల వరకు దాదాపు 45 నిమిషాల పాటు ప్రధాన బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. ఈ స్వల్పకాలిక అంతరాయం వల్ల డిజిటల్ లావాదేవీలు జరిపే వారికి ఇబ్బందులు కలగవచ్చు.

Read Also :Google Pixel 11: వచ్చేస్తోంది పిక్సెల్ 11! ఐఫోన్ క్రేజ్‌కు చెక్ పెట్టే ఫీచర్లు ఇవేనా?

 SBI servers are in maintenance mode; UPI will not work.

నిలిచిపోనున్న యూపీఐ, యోనో సేవలు.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!

ఈ మెయింటెనెన్స్ సమయంలో ఎస్‌బీఐకి చెందిన UPI, IMPS, YONO యాప్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT మరియు RTGS వంటి డిజిటల్ సేవలు పని చేయవు. అయితే, ఖాతాదారులు అత్యవసర నగదు అవసరాల కోసం ATM సేవలను ఉపయోగించుకోవచ్చని బ్యాంక్ సూచించింది. అలాగే, చిన్న తరహా డిజిటల్ లావాదేవీల కోసం UPI Lite ఫీచర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. వినియోగదారులకు కలిగే ఈ అసౌకర్యానికి బ్యాంక్ యాజమాన్యం విచారం వ్యక్తం చేసింది.

SBI Banking Services Down:ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలి

ముందుస్తుగా ప్రకటించిన ఈ సమయానికి అనుగుణంగా ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం లోపు పూర్తి చేయాల్సిన అత్యవసర పేమెంట్లను 11 గంటల ముందే ముగించుకోవడం మంచిది. బ్యాంకు సేవలు తిరిగి 11:45 గంటల తర్వాత యధావిధిగా పునరుద్ధరించబడతాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

స్పామ్ కాల్స్‌ను ఇలా అడ్డుకోండి!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha