Sravanamasam 2026 : హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతుంది. ఈ శుభ సమయంలో ఉదయాన్నే అభ్యంగన స్నానం ఆచరించి, ఇంటిని శుభ్రం చేసి గడపలకు పసుపు, కుంకుమలు అద్దడం, తోరణాలు కట్టడం లక్ష్మీదేవికి స్వాగతం పలకడానికి ప్రతీకగా భావిస్తారు.
పూజా మందిరాన్ని విశేషంగా అలంకరించి ప్రథమ పూజ్యుడైన విఘ్నేశ్వరుడు, సర్వేశ్వరుడైన పరమశివుడు మరియు ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మిని భక్తిశ్రద్ధలతో ఆరాధించాలి. ముఖ్యంగా ఈ మాసంలో శివాలయాలను దర్శించి స్వామివారికి రుద్రాభిషేకం లేదా జలాభిషేకం చేయించడం వల్ల విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు.

నిత్య దీపారాధన, సాత్విక జీవనం మరియు దానధర్మాల ప్రాశస్త్యం
శ్రావణ మాసంలో నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో పూజా గదిలోనే కాకుండా తులసి కోట వద్ద దీపారాధన చేయడం వల్ల ఇంట్లోని నకారాత్మక శక్తి తొలగిపోయి శాంతి, సౌభాగ్యాలు సిద్ధస్తాయి. ఈ పవిత్ర నెల అంతా మాంసాహారానికి సంపూర్ణంగా దూరంగా ఉండి, సులభంగా జీర్ణమయ్యే సాత్విక (శాకాహార) ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం వల్ల శరీరానికి, మనస్సుకు పవిత్రత చేకూరుతుంది. దీనితో పాటు శక్తి కొలదీ అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులతో పాటు సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

