ఐపీఎల్ 2026 సీజన్లో ఒక సామాన్య కుర్రాడు అసాధారణ ఇన్నింగ్స్తో రాత్రికి రాత్రే ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకర్షించాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగిన ముకుల్ చౌదరి, కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సృష్టించిన విధ్వంసం ఒక కొత్త చరిత్రకు నాంది పలికింది.
కోల్కతా నిర్దేశించిన 182 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో లక్నో జట్టు 128 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమికి అంచున నిలిచింది. క్రీజులోకి వచ్చిన 21 ఏళ్ల ముకుల్ చౌదరిపై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. కానీ, కేవలం 27 బంతుల్లో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచిన ముకుల్, మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అందులోనూ ఇన్నింగ్స్ చివరి 5 ఓవర్లలోనే 53 పరుగులు రాబట్టడం అతని పోరాట పటిమకు నిదర్శనం. చివరి ఓవర్లో 14 పరుగులు అవసరమైన తరుణంలో, ఐదో బంతికి భారీ సిక్సర్ బాది స్కోర్లు సమం చేయడమే కాకుండా, ఆఖరి బంతికి విజయాన్ని ఖాయం చేసి లక్నో క్యాంపులో సంబరాలు నింపాడు.
Read Also : Fire at Mumbai Airport: ముంబై ఎయిర్పోర్ట్లో అగ్నిప్రమాదం: టెర్మినల్-1 వద్ద టెన్షన్!

దిగ్గజాల సరసన అరుదైన రికార్డు
ఐపీఎల్ 18 ఏళ్ల చరిత్రలో ముకుల్ చౌదరి ఒక అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఒక విజయవంతమైన రన్ ఛేజ్లో చివరి 5 ఓవర్లలో 50 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి భారతీయ బ్యాటర్గా ముకుల్ రికార్డు సృష్టించాడు. గతంలో ఈ ఘనతను విదేశీ దిగ్గజాలు కీరన్ పొలార్డ్ (2013), ఏబీ డివిలియర్స్ (2014) మాత్రమే సాధించారు. ఇప్పుడు వీరి సరసన 21 ఏళ్ల ఈ భారతీయ కుర్రాడు చేరడం విశేషం. ముఖ్యంగా వైభవ్ అరోరా బౌలింగ్లో ముకుల్ ఆడిన హెలీకాప్టర్ షాట్, ఎంఎస్ ధోనీని తలపించడంతో స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది.
ముకుల్ ‘పవర్’ – కేకేఆర్ పతనం
ఈ విజయంతో లక్నో సూపర్ జెయింట్స్ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోగా, కోల్కతా నైట్ రైడర్స్కు ఇది ఊహించని దెబ్బగా మారింది. కేకేఆర్ తరపున వైభవ్, అనుకూల్ రాయ్ వికెట్లు తీసి ఒత్తిడి పెంచినప్పటికీ, ముకుల్ ధాటికి వారి వ్యూహాలన్నీ తలకిందులయ్యాయి. లక్నో తరపున ఆయుష్ బదోని (54) అందించిన సహకారం కూడా జట్టుకు వెన్నుముకగా నిలిచింది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ను ఒంటిచేత్తో గెలిపించిన ముకుల్ చౌదరిని ప్రస్తుతం క్రికెట్ విశ్లేషకులు “ఫ్యూచర్ ఫినిషర్”గా అభివర్ణిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

