Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఒళ్లు బలిసి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు - కూనంనేని

ఒళ్లు బలిసి విమర్శలు చేస్తే ఊరుకునేది లేదు - కూనంనేని

వార్త 1 week ago

Kothagudem MLA Warning : కొత్తగూడెం శాసనసభ్యుడు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

అనవసర వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలకు పాల్పడే వారిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరిపాలన సౌలభ్యం మరియు పాలనా పరమైన పనుల విభజనలో భాగంగా బాధ్యతలు అప్పగిస్తే, సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషాను “షాడో ఎమ్మెల్యే” అంటూ ముద్ర వేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తే ఇకపై చూస్తూ ఊరుకునేది లేదని, సహనానికి కూడా హద్దులు ఉంటాయని ప్రత్యర్థులను తీవ్రంగా హెచ్చరించారు.

అవినీతి ఆరోపణలపై క్రిమినల్ కేసులు - పారదర్శకతపై స్పష్టత

స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లేదా నియోజకవర్గంలో ఎలాంటి అవినీతి జరిగినా సహించేది లేదని ఎమ్మెల్యే కూనంనేని స్పష్టం చేశారు. భూ ఆక్రమణలు, బెదిరింపులు లేదా ఇళ్ల పట్టాలు, నంబర్ల కేటాయింపులో లంచాలకు పాల్పడినట్లు రుజువైతే ఎవరినీ విడిచిపెట్టబోమని, విచారణ జరిపి నేరుగా క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామని తేల్చిచెప్పారు. అభివృద్ధి పనులపై దృష్టి సారించి ప్రజలకు మేలు చేస్తుంటే, ఓర్వలేక విషప్రచారం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గ సంక్షేమం కోసం పని చేస్తున్న తమ నాయకులపై బురద జల్లే ప్రయత్నాలు మానుకోవాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మహబూబ్‌నగర్‌లో బ్రహ్మోస్ మిస్సైల్ తయారీ యూనిట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha