Dailyhunt
ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రిటీలు

ఓటు హక్కు వినియోగించుకున్న సినీ సెలబ్రిటీలు

వార్త 1 week ago

Tamil Nadu Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం నేడు (ఏప్రిల్ 23, 2026) పతాక స్థాయికి చేరుకుంది. ఉదయం నుంచే సామాన్యులతో పాటు సినీ, రాజకీయ దిగ్గజాలు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక చెన్నైలోని తమ నివాసానికి సమీపంలో ఉన్న పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. కమల్ హాసన్, రజనీకాంత్, అజిత్, విక్రమ్, ధనుష్, శృతిహాసన్, త్రిషతోపాటు పలువురు సినీ ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. సీఎం ఎంకే స్టాలిన్ కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. టీవీకే చీఫ్ విజయ్ ఓటు వేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha